Adipurush: శ్రీరాముడిగా ప్రభాస్.. ఫారెస్ట్ సీన్ కోసం 50 కంపెనీల శ్రమ, ఎన్ని కోట్ల ఖర్చంటే ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 12, 2022, 12:34 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతులో దాదాపు అరడజను పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. త్వరలో రాధే శ్యామ్ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది.

PREV
16
Adipurush: శ్రీరాముడిగా ప్రభాస్.. ఫారెస్ట్ సీన్ కోసం 50 కంపెనీల శ్రమ, ఎన్ని కోట్ల ఖర్చంటే ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతులో దాదాపు అరడజను పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. త్వరలో రాధే శ్యామ్ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని 'సలార్' చిత్రం.. ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న 'ఆదిపురుష్' చిత్రాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

26

ప్రభాస్ తొలిసారి నటిస్తున్న పౌరాణిక చిత్రం కావడంతో 'ఆదిపురుష్' పై కనీవినీ ఎరుగని విధంగా అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. భారీగా విఎఫెక్స్ వర్క్ ఉండడంతో దీనికోసం దర్శకుడు ఏకంగా 6 నెలల సమయం కేటాయించారు. ప్రస్తుతం సిజి, విఎఫెక్స్ వర్క్ వేగంగా జరుగుతున్నాయి. 

36

ప్రభాస్ శ్రీరాముడిగా ఎలా ఉంటాడో అని అభిమానులంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. శ్రీరాముడు అడవులకు వెళ్లడం గురించి అందరికి తెలుసు. అయితే ఫారెస్ట్ లో దర్శకుడు ఓం రౌత్ ఓ ప్రత్యేక సన్నివేశాన్ని డిజైన్ చేశారట. 

46

బిగ్ స్క్రీన్ పై ఆ సీన్ చెదిరే విధంగా ఉండబోతున్నట్లు టాక్. ఆ సన్నివేశం కోసం ఏకంగా 60 కోట్ల బడ్జెట్ ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సీన్ కి విఎఫెక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుందట. దాదాపు 50 విదేశీ కంపెనీలు ఆదిపురుష్ విఎఫెక్స్ వర్క్ కోసం శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. 

56

మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాత భూషణ్ కుమార్ వాల్ట్ డిస్ని సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆదిపురుష్ చిత్రాన్ని ఆగష్టు 11న రిలీజ్ చేయనున్నారు. 

66

ఈ మూవీలో సీతాదేవి పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. నటుడు సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ రామాయణ మూల కథని తీసుకుని తనదైన శైలిలో వెండితెరపై ప్రజెంట్ చేయనున్నారు.  

Read more Photos on
click me!

Recommended Stories