ఈ సినిమాలో హీరోయిన్ కు తాత పాత్రలో నటించిన రాజన్ పి దేవ్ గుర్తున్నారా.. ఆయన కూడా చాలా తక్కువ వయస్సులోనే మరణించారు. రాజన్ పి దేవ్ మలయాళ నటుడు. కాని ఆయన టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించారు. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో మెయిన్ విలన్ గా.. హీరోయిన్ ఫాదర్ గా కనిపించారు.
రాజన్ పి దేవ్ 58 ఏళ్ల వయస్సులో 2009 లో అనారోగ్య కారణాలతోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో మంది టాలెంట్ ఉన్న నటులను కోల్పోయింది. దాంతో ప్రస్తుతం ఇతర భాషల నుంచి ఎక్కువ మంది నటులు తెలుగు ఇండస్ట్రీకి దిగుమతి అవుతున్నారు.