మంజుమ్మల్ బోయ్స్ సినిమా నిర్మాతలకు సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. గుణ (1991) సినిమాలో తాను స్వరపరిచిన ఓ పాటను ‘మంజుమ్మల్ బోయ్స్’ సినిమాలో అనుమతి లేకుండా వాడుకున్నందుకుగాను ఇళయరాజా ఈ నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్ , షాన్ ఆంటోనీ ల అడ్రస్ లకు ఇళయారాజా ఈ నోటీసులు పంపించారు. ఆ మేటర్ మొత్తానికి సెటిల్ మెంట్ తో క్లోజ్ అయ్యినట్లు తెలుస్తోంది.