కానీ నేడు పరిస్థితి మారిపోయింది. దేశంలోని అగ్రశ్రేణి గాయకులకు లక్షల్లో పారితోషికం ఇస్తున్నారు. అంతేకాదు, కొంతమంది గాయకులు ఒక పాటకు 20 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. ముఖ్యంగా భారతీయ భాషలన్నింటిలోనూ అగ్రగాయనిగా వెలుగొందుతున్న శ్రేయా ఘోషల్ ఒక పాటకు సుమారు 25 నుంచి 30 లక్షల వరకు పారితోషికంగా తీసుకుంటున్నారట. హిందీలోనే కాదు, తెలుగు , తమిళంలోనూ ఆమె అగ్రగాయని అని చెప్పాలి.