సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాట కారణంగా ఊపిరాడక తన భార్య, కుమారుడు కుప్పకూలారని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో భాస్కర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. మహిళ మృతిచెందగా, బాలుడు చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. నిర్మాతలైనంత మాత్రాన ఘటనకు బాధ్యులను చేస్తూ క్రిమినల్ కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధం. మాపై ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలి’అని రవిశంకర్, నవీన్ పిటిషన్ దాఖలు చేశారు.