సైబర్ క్రైమ్ కి వ్యతిరేకంగా రష్మిక మందాన యుద్ధం, ఇండియన్ గవర్నమెంట్ తో చేతులు కలిపిన స్టార్ లేడీ, డిటైల్స్! 

First Published Oct 15, 2024, 2:34 PM IST

డిజిటల్ వరల్డ్ లో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయింది. అనేక రూపాల్లో సామాన్యులు, ప్రముఖులు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. సైబర్ క్రైమ్ కి వ్యతిరేకంగా రష్మిక మందాన పోరాటం మొదలుపెట్టింది. 

Rashmika Mandanna


సైబర్ క్రైమ్ అనేక రూపాల్లో జరుగుతుంది. ఆర్థిక నేరాలు, వేధింపులు, మోసం, మార్ఫింగ్ వీడియోలు సైబర్ నేరాల్లో కొన్ని మాత్రమే. సాంకేతికత పెరిగే కొద్ది సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త ఆలోచనలతో సామాన్యులను మోసం చేస్తున్నారు. అలాగే ప్రముఖుల పై వేధింపులకు పాల్పడుతున్నారు. 

డీప్ ఫేక్ వీడియో అతిపెద్ద సమస్యగా మారింది. రష్మిక మందాన ఫేక్ వీడియో దేశాన్ని కుదిపేసింది. బ్రిటన్ కి చెందిన సోషల్ మీడియా స్టార్ జరా పటేల్ వీడియోను రష్మిక మందాన వీడియోగా డీప్ ఫేక్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఆ వీడియో రష్మిక మందానదే అని భావించిన జనాలు ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. 

ఓ జర్నలిస్ట్ ఒరిజినల్ వీడియో బయటపెట్టారు. డీప్ ఫేక్ టెక్నాలజీతో జరా పటేల్ వీడియోను రష్మిక మందానది గా మార్ఫ్ చేశారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో పై అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఇది అతిపెద్ద సమస్య. భారత ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని ఆయన సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. 
 

Latest Videos


నేను హీరోయిన్ కాబట్టి ఈ సమస్యను ఎదుర్కొన్నాను. అదే నేను స్కూల్ లేక కాలేజ్ లో చదివే రోజుల్లో ఇలా జరిగితే పరిస్థితి ఏమిటీ? మహిళలు జాగ్రత్తగా ఉండాలని రష్మిక మందాన తెలియజేశారు. రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియో పోస్ట్ చేసింది గుంటూరుకు చెందిన ఓ యువకుడు కావడం విశేషం. నెలల తరబడి జరిగిన విచారణలో నిందితుడిని పట్టుకున్నారు. 

అనంతరం ప్రియాంక చోప్రా, అలియా భట్, నోరా ఫతేహి, కత్రినా కైఫ్, కాజోల్ సైతం ఈ డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. వీరి ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సైబర్ క్రైమ్ అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం దీనిపై అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకుంది. 
 

మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ రష్మిక మందానను సైబర్ క్రైమ్ సేఫ్టీ నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఈ విషయాన్ని రష్మిక మందాన స్వయంగా తెలియజేసింది. సైబర్ క్రైమ్ కి నేను కూడా బాధితురాలినే. సైబర్ క్రైమ్ కి వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన పోరాటంలో తాను భాగమైనందుకు సంతోషంగా ఉందని, రష్మిక మందాన వెల్లడించారు. 

సైబర్ క్రైమ్ సేఫ్టీ పై ప్రభుత్వం నిర్వహించనున్న కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. మరోవైపు నటిగా రష్మిక మందాన ఫుల్ బిజీ. ఆమె చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. వీటిలో పుష్ప 2 క్రేజీ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 డిసెంబర్ 6న విడుదల కానుంది. నార్త్ లో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 

rashmika mandanna

గర్ల్ ఫ్రెండ్, రైన్ బో టైటిల్స్ తో రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. సల్మాన్ కి జంటగా సికిందర్ మూవీలో నటిస్తుంది. కోలీవుడ్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్నాడు. సికిందర్ భారీ బడ్జెట్ మూవీ. రష్మిక మందాన నటిస్తున్న మరో బాలీవుడ్ మూవీ చావా. విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్నాడు. ఇది పీరియాడిక్ బయోపిక్ కావడం విశేషం. 


బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం బయటకు వెళ్లేది ఎవరు?

ధనుష్-నాగార్జున కాంబోలో వస్తున్న కుబేర చిత్రంలో సైతం రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందాన కెరీర్లో ఎదిగిన తీరు అద్భుతం. అటు సౌత్ ఇటు నార్త్ లో ఆమె సత్తా చాటుతుంది. యానిమల్ మూవీతో బాలీవుడ్ లో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. 

click me!