చిత్ర పరిశ్రమలో విజయాల ఆధారంగానే అవకాశాలు వస్తాయి. అత్యంత తక్కువ సక్సెస్ రేట్ కలిగిన పాయల్ ని మెల్లగా దర్శక నిర్మాతలు దూరం పెట్టారు. అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తున్న పాయల్ కి సరైన బ్రేక్ రావడం లేదు.పాయల్ లేటెస్ట్ మూవీ మాయా పేటిక థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కింది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం మొబైల్ వినియోగం ఎక్కువ కావడం వలన ఏర్పడే దుష్ప్రభావాలను తెలియజేస్తూ దర్శకుడు రమేష్ రాపర్తి తెరకెక్కిస్తున్నారు. సునీల్, హిమజ, పృథ్వి, శ్రీనివాసరెడ్డి కీలక రోల్స్ చేస్తున్నారు.