వరలక్ష్మి ఎంగేజ్ మెంట్ పై మాజీ ప్రియుడు విశాల్ షాకింగ్ కామెంట్స్, ఇలా అనేశాడేంటి..?

First Published Apr 15, 2024, 4:19 PM IST

తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంగేజ్ మెంట్ పై స్పందించారు స్టార్ హీరో విశాల్. ఏమాత్రం తడబాటు లేకుండా సమాధానం చెప్పారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. 
 

రీసెంట్ గా తమిళ నటి.. శరత్ కుమార్ కూతురు.. వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. 40 ఏళ్ళకు అడుగు దూరంలో ఉంది వరలక్ష్మి. నటిగా ఎంతో బిజీగా ఉంది వరలక్ష్మి. హీరోయిన్ గా ఎంటర్ అయినా.. కెరక్టర్ రోల్స్ చేయడం స్టార్ట్ చేస.. అందులోనే స్టార్ గా మారింది. అంతే కాదు పెద్ద పెద్ద సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ పాత్రల్లో మెప్పిస్తోంది తమిళ బ్యూటీ. 

ఇక ఆమె ఎంగేజ్మెంట్ తాజాగా జరిగింది. గతంలో ఆమె తమిళ స్టార్ హీరో విశాల్ తో లవ్ లో ఉందని ప్రచారం గట్టిగా జరిగింది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన వీరు.. ఆతరువాత కాలంలో బ్రేకప్ చెప్పుకున్నారన్న టాక్ ఉంది. ఇప్పటి వరకూ విశాల్ కూడా పెళ్ళి చేసుకోలేదు. కాగా వరలక్ష్మీ ఎంగేజ్ మెంట్ పై విశాల్ స్పందన కోసం అందరూ ఎదరు చూశారు. తాజాగా ఆ టైమ్ రానే వచ్చింది. ఈ విషయంలో విశాల్ స్పందించారు. 

రికార్డ్ ల రారాజుగా అల్లు అర్జున్, పుష్ప2 రిలీజ్ కు ముందే మొదలైన వేట..

ప్రస్తుతం రత్నం సినిమా చేస్తున్నాడు విశాల్. ఈసినిమా  ప్రమోషన్ కోసం ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ స్టార్ హీరోకు  వరలక్ష్మి శరత్‌కుమార్ గురించి.. ఆమెకు రీసెంట్ గా జరిగిన నిశ్చితార్థం గురించి ప్రశ్న ఎదురయ్యింది. దాంతో ఆయన తడుముకోకుండా జావాబు ఇచ్చారు.  వరలక్ష్మిని తలచుకుంటే చాలా సంతోషంగా ఉందని విశాల్ అన్నారు.
 

జాక్ పాట్ కొట్టిన జాన్వీ కపూర్, ఎన్టీఆర్, చరణ్ తో పాటు..మరో భారీ తెలుగు ప్రాజెక్ట్ లో బాలీవుడ్ బ్యూటీ.. ?

తమిళంతో పాటు..  తెలుగు లో కూడా ఆమె దూసుకుపోతోంది. టాలీవుడ్ లో కూడా వరలక్ష్మికి  మంచి మార్కెట్‌ ఉంది. హనుమాన్‌లో వరలక్ష్మి పాత్ర మెస్మరైజింగ్‌గా ఉంది అని కితాబిచ్చారు విశాల్. అంతే కాదు ఆమె చాలా తక్కువ టైమ్ లోనే ఉన్నత స్థాయికి చేరుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెడుతున్నందకు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు విశాల్. 

బాలీవుడ్ స్టార్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్న సౌత్ ఇండియన్ హీరోలు ఎవరో తెలుసా.. ?

తమిళంతో పాటు తెలుగు మార్కెట్ లో కూడా మంచి పేరు సంపాదించాడు విశాల్.. ప్రస్తుతం ఆయన రత్నం  సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో  విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా  నటిస్తోంది. యాక్షన్  మూవీగా రూపొందుతున్న రత్నం ఏప్రిల్ 26న థియేటర్లలో సందడి చేయబోతోంది.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. మూవీ ప్రమోషన్స్ లో టీమ్ బిజీగా ఉన్నారు. 

అటు వరలక్ష్మి కూడా వరుస సినిమాలతో హడావిడి చేస్తోంది. తమిళ, తెలుగు, మలయాళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. విశాల్ తో బ్రేకప్ తరువాత ఆమె ఆర్టిస్ట్ నికోలాయ్‌తో ప్రేమలో పడింది. త్వరలో పెళ్ళి  కూడా చేసుకోబోతోంది.

click me!