Raj Tarun-Lavanya controversy
రాజ్ తరుణ్ పై మాజీ ప్రేయసి లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 2008లో సోషల్ మీడియా వేదికగా మొదలైన పరిచయం ప్రేమకు దారి తీసింది. 2014లో రాజ్ తరుణ్ నన్ను వివాహం చేసుకున్నాడు. రెండుసార్లు అబార్షన్ అయ్యింది. మెడికల్ బిల్స్ రాజ్ తరుణ్ స్వయంగా చెల్లించాడు.
Raj Tarun and Lavanya
మాల్వి మల్హోత్రా తో పరిచయం తర్వాత నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. మూడు నెలల క్రితం ఇంటి నుండి వెళ్ళిపోయాడు. నన్ను వదిలేయకపోతే చంపేస్తా అని బెదిరిస్తున్నాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, ఆమె బ్రదర్ మయాంక్ మల్హోత్రాలను వరుసగా A1, A2, A3లుగా చేర్చారు.
Raj Tarun and Lavanya
ఈ ముగ్గురిపై 420, 493, 506 సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. లావణ్య సమర్పించిన ఆధారాలు నిజమని తేలితే.. రాజ్ తరుణ్ అరెస్ట్ కావడం ఖాయం. ఈ క్రమంలో రాజ్ తరుణ్ లావణ్య తో సంధి కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడట.
Raj Tarun and Lavanya
రాజ్ తరుణ్ తరపున తనకు రెండు ఫోన్ కాల్స్ వచ్చాయని లావణ్య అంటున్నారు. మొదట రాజ్ తరుణ్ మేనేజర్ ఫోన్ చేశాడట. అనంతరం ఆయన లాయర్ కాల్ చేసి లావణ్యతో మాట్లాడట. రూ. 5 కోట్లు ఇస్తాము కేసు వెనక్కి తీసుకుని... ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరారట. అయినప్పటికీ నేను ఒప్పుకోలేదని లావణ్య అంటుంది.
నాకు డబ్బులు వద్దు. రాజ్ తరుణ్ మాత్రమే కావాలి. డబ్బులు తీసుకుని కేసు విత్ డ్రా చేసుకోవడం కుదరని ఆమె బల్లగుద్ది చెబుతారు. కాగా గతంలో కూడా రాజ్ తరుణ్ ఆమెకు ఇలాంటి ఆఫర్స్ ఇచ్చాడట. రాజ్ తరుణ్ కి చెందిన ఇంటిని తనకు ఇచ్చేస్తా అన్నాడట. అలాగే ప్రతి నెల మైంటెనెన్సు కూడా ఇస్తాను. నా జోలికి రాకూడదని డీల్ కి ప్రయత్నం చేశాడని లావణ్య అంటున్నారు.
రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ తిరగబడరసామీ. ఈ మూవీలో మాల్వి మల్హోత్రా-రాజ్ తరుణ్ జంటగా నటించారు. వీరిద్దరూ లావణ్య నుండి ఎఫైర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజ్ తరుణ్ నా సహనటుడు మాత్రమే.. మధ్య ఎలాంటి సంబంధం లేదని మాల్వి మల్హోత్రా అంటున్నారు. లావణ్య-మాల్వి మల్హోత్రా మధ్య వాగ్వాదం జరిగినట్లు ఆడియో కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి..