మూడేళ్లలో ముగ్గురు... సూపర్ స్టార్ కుటుంబంలో వరుస మరణాలు... మహేష్ ని ఓదార్చిడం కష్టమే!

First Published Sep 28, 2022, 8:23 AM IST

మహేష్ బాబు కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మూడేళ్ళ వ్యవధిలో ఆ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కన్నుమూశారు. కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా తుదిశ్వాస విడుస్తున్నారు.

Mahesh Babu Family

కృష్ణ రెండవ భార్య విజయనిర్మల 2019 జూన్ 27న హార్ట్ అటాక్ తో కన్నుమూశారు. అనుకోని ఈ సంఘటన కృష్ణ కుటుంబాన్ని షాక్ కి గురి చేసింది. ముఖ్యంగా కృష్ణ ఆమె మృతిని తట్టుకోలేకపోయారు. దశాబ్దాలుగా అర్థాంగిగా, స్నేహితురాలిగా, తోటి నటిగా, నిర్మాతగా ఆయనకు ప్రతి విషయంలో విజయ నిర్మల తోడున్నారు.

vijaya nirmala

కెరీర్ బిగింగిన్ లోనే విజయనిర్మలతో కృష్ణకు పరిచయం ఏర్పడింది. సాక్షి మూవీ చేస్తున్న రోజుల్లో పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారితీసింది. అప్పటికి కృష్ణ ఇందిరా దేవిని వివాహం చేసుకొని ఉన్నారు. రెండో వివాహంగా విజయనిర్మలను చేసుకున్నారు. ఇందిరమ్మ, విజయనిర్మల ఇద్దరితో కృష్ణ సాన్నిహిత్యం కొనసాగించారు.

ఇక ఈ ఏడాది ప్రారంభంలో మహేష్ అన్నయ్య రమేష్ బాబు అకాల మృతి చెందారు. కొన్నాళ్లుగా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న రమేష్ బాబు చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. రమేష్ బాబు మృతి కృష్ణ, మహేష్ లను కృంగదీసింది. చిన్న వయసులో రమేష్ బాబు ప్రాణాలు వదలడం కలచి వేసింది.

కృష్ణ నటవారసుడిగా రమేష్ బాబు వెండితెరకు పరిచయమయ్యాడు. హీరోగా పలు చిత్రాల్లో నటించారు. తండ్రి కృష్ణ, తమ్ముడు మహేష్ తో కలిసి మల్టీస్టారర్స్ చేశారు. అయితే రమేష్ బాబు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. 1997 లో విడుదలైన ఎన్కౌంటర్ మూవీలో చిన్న పాత్ర చేసిన రమేష్ బాబు... వెండితెరకు దూరమయ్యారు.

ఇక నేడు మహేష్ తల్లి ఇందిరా దేవి కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఇందిరా దేవి అనారోగ్య సమస్యలతో భాదపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో నివాసంలో తెల్లవారు ఝామున కన్నుమూశారు. మహేష్ కి అత్యంత ప్రీతి పాత్రమైన తల్లి ఇందిరా దేవి మరణం తీవ్ర విషాదంలో ముంచి వేసింది. నేడు మహాప్రాస్థానంలో ఇందిరా దేవి అంత్యక్రియలు జరగనున్నాయి. 
 

click me!