సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ లేటెస్ట్ లుక్... రాజమౌళి దుబాయ్ లో ఏం చేశాడు?

First Published Apr 19, 2024, 1:24 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్ కాకరేపుతుంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా మహేష్ ఉన్నాడు. దుబాయ్ లో రాజమౌళి-మహేష్ భేటీ కాగా, అక్కడ ఏం జరిగిందనే చర్చ మొదలైంది... 
 


మహేష్ బాబు గుంటూరు కారంతో ఫ్యాన్స్ ని అలరించాడు. మిక్స్డ్ టాక్ తో కూడా గుంటూరు మిర్చి మంచి వసూళ్లు రాబట్టింది. ఈ జోరులో రాజమౌళి మూవీకి సిద్ధం అవుతున్నాడు మహేష్. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుండగా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఎస్ఎస్ఎంబి 29 కి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టైం రాజమౌళి-మహేష్ కాంబోలో మూవీ రూపొందనుంది. 2020లో రాజమౌళి ఈ ప్రకటన చేశాడు. 

ఎస్ఎస్ఎంబి 29న ప్రకటన తర్వాత మొదటిసారి అధికారికంగా కలిశారు మహేష్-రాజమౌళి. వీరిద్దరూ దుబాయ్ లో భేటీ అయ్యారు. వీరితో నిర్మాత కే ఎల్ నారాయణ సైతం జాయిన్ అయ్యారు. ఎస్ఎస్ఎంబి 29 స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్, షూటింగ్ వంటి కీలక విషయాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయని తెలుస్తుంది. మహేష్ బాబు స్క్రిప్ట్ లాక్ చేశాడట. రాజమౌళి నెరేషన్ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశాడని సమాచారం. 
 

దుబాయ్ లో రాజమౌళి-మహేష్ భేటీ ముగిసిన నేపథ్యంలో ఇండియా వచ్చారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో మహేష్, రాజమౌళి, కే ఎల్ నారాయణ కనిపించారు. కాగా మహేష్ లుక్ నెటిజెన్స్ ని ఆకట్టుకుంది. ఆయన పెరిగిన జుట్టు, గడ్డంతో మాస్ గా కనిపించారు. రాజమౌళి తన హీరోల లుక్ గొప్పగా డిజైన్ చేస్తాడు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రెజెంట్ చేయాలి అనుకుంటాడు.

Rajamouli

అలాగే రాజమౌళి చిత్రంలో హీరో అంటే సిక్స్ ప్యాక్ చేయాల్సింది. మహేష్ ఇంత వరకు సిక్స్ ప్యాక్ ట్రై చేయలేదు. అలా చూడాలన్న మహేష్ ఫ్యాన్స్ కోరికను  రాజమౌళి తీర్చడం ఖాయంగా కనిపిస్తుంది. దుబాయ్ మీటింగ్ లో మహేష్ లుక్ గురించి కూడా మాట్లాడుకుకున్నారని సమాచారం. జూన్ లేదా జులై నెలలో మూవీ సెట్స్ పైకి వెళ్లే సూచనలు కలవు. 

రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 వివరాలు తెలియజేస్తూ ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నాడట. ఇక ఎస్ఎస్ఎంబి 29 జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనుంది. మహేష్ బాబు ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా కనిపిస్తాడట. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో ఎస్ఎస్ఎంబి 29 ఉంటుందని రాజమౌళి స్వయంగా తెలియజేశాడు. ఈ చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 800 కోట్లు అని సమాచారం.  

click me!