సంచలనం... నటుడు సప్తగిరి కాళ్లు పట్టుకోబోయిన బాలకృష్ణ...  కారణం తెలిస్తే షాక్ అవుతారు!

First Published Sep 10, 2022, 2:37 PM IST


అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నటసింహం బాలకృష్ణ నటుడు సప్తగిరి కాళ్ళు మొక్క ప్రయత్నం చేయడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 
 

Balakrishna

బాలయ్యది చిన్న పిల్లాడి మనస్తత్వం అంటారు. పైకి గంభీరంగా కనిపించే బాలయ్య నచ్చితే ప్రేమ కురిపించేస్తారు. ఆయనకు కోపం వచ్చినా రియాక్షన్ అదే రేంజ్ లో ఉంటుంది. పబ్లిక్ లో ఫ్యాన్స్ పై చేయిచేసుకున్న బాలయ్య పలుమార్లు విమర్శలకు గురయ్యారు. అయితే దెబ్బలు తిన్న అభిమానులు మాత్రం ఆయన చేయి తగలడమే అదృష్టం అంటారు. 
 

Balakrishna

అలాగే బాలయ్యకు తండ్రి ఎన్టీఆర్ సినిమాలు అనే మహా ఇష్టం. ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే  ఎన్టీఆర్ నటించిన పౌరాణిక, జానపద చిత్రాలు చూస్తారు. సదరు సినిమాల్లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ బట్టీపడతారు. సందర్భం వచ్చినప్పుడు తండ్రి డైలాగ్స్ చెప్పి ఫ్యాన్స్ ని అలరిస్తారు. 
 


ఎన్టీఆర్ నటించిన దాన వీర శూర కర్ణ ఓ ఎపిక్ అని చెప్పాలి. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఆ చిత్రంలో ఎన్టీఆర్ కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు గెటప్స్ లో కనిపించాడు. దుర్యోధనుడిగా ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ ఎవర్ గ్రీన్. ఇప్పటికీ పల్లెటూళ్లలో ఆ డైలాగ్స్ ఆడియో జనాలు వింటూ ఉంటారు. ఇక మయసభలో పరాభవం జరిగిన తర్వాత దుర్యోధనుడు తనలో తాను అవమాన భారం అనుభవిస్తాడు. 

పాండవుల ఆహ్వానం అంగీకరించి అనవరంగా మయసభకు వెళ్లానని చింతిస్తాడు. ద్రౌపది మీద కోపంతో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ అబ్బురపరుస్తాయి. కాగా ఈ డైలాగ్స్ లో ఒకదాన్ని బాలకృష్ణ, సప్తగిరి ట్రై చేశారు. ఇద్దరూ కలిసి చెప్పే ప్రయత్నం చేశారు. బాలయ్య మధ్యలో మర్చిపోగా సప్తగిరి అనర్గళంగా డైలాగ్ పూర్తి చేశాడు. 
 

సప్తగిరి టాలెంట్ కి ఫిదా అయిన బాలకృష్ణ ఆ కాళ్ళు ఇటు ఇవ్వరా బాబు... దండం పెట్టుకుంటా.. అని వంగి సప్తగిరి కాళ్ళకు మొక్కే ప్రయత్నం చేశాడు. దాంతో సప్తగిరి అవాక్కయ్యాడు. అయ్యో అంటూ వెనక్కి జరిగి క్రింద కూర్చున్నాడు. అంత పెద్ద స్టార్ సరదాకి కూడా అలా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు బాలయ్య సింప్లిసిటీ కి ముచ్చట పడుతున్నారు. 

బాలయ్య లేటెస్ట్ మూవీ NBK 107 సెట్స్ లో ఇది సంఘటన చోటు చేసుకుంది. గ్యాప్ లో బాలయ్య, సప్తగిరి ఇలా సరదాగా గడిపారు. దర్శకుడు గోపీచంద్ మలినేని శరవేగంగా షూట్ పూర్తి చేస్తున్నాడు. ఓ కీలక రోల్ సప్తగిరి చేస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

click me!