అయితే అశ్వీన్ చేసిన రాజుగారి గది సిరీస్ లకు అన్న ఓంకార్ దర్శకుడు కావడం విశేషం. ప్రస్తుతం హిడింబ సినిమాతో రాబోతున్నాడు అశ్వీన్. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో అశ్విన్కు జోడీగా నందితా శ్వేత హీరోయిన్గా నటించింది. అయితే ఈమూవీ టీమ్ ప్రమోషన్ లో భాగంగా.. ఓంకార్ హోస్ట్ చేసే.. సిక్త్ సెన్స్ అనే గేమ్ షోకు వెళ్లారు. అశ్విన్, హీరోయిన్ నందితా శ్వేత, విద్యుల్లేఖా రామన్, ఈ షోలో సందడి చేశారు.