సుశాంత్ ఆరోగ్యంపై సంచలన విషయాలు.. అందుకే గర్ల్‌ ఫ్రెండ్ కూడా వదిలేసింది!

First Published Jun 16, 2020, 11:30 AM IST

యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌  34 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవటంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన మానసిక పరిస్థితిపై కూడా అనుమానాలు కలుగుతున్నాయి అందుకుతగ్గట్టుగా ప్రముఖు జర్నలిస్ట్ సుహ్రితా సేన్‌ గుప్తా సంచలన విషయాలను వెల్లడించారు.

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ బాలీవుడ్‌లోనే సూపర్‌ హ్యాండ్సమ్‌ హీరో, అయితే హీరోగా ఎంతో పాపులర్‌ అయిన ఈ స్టార్‌ తన చుట్టూ ఓ మిస్టీరిస్‌ ప్రపంచాన్ని సృష్టించుకొని బతికేవాడని తెలుస్తోంది.
undefined
సుశాంత్ మరణంపై బాలీవుడ్‌ సినిమా టెలివిజన్‌ ఇండస్ట్రీలు నివాళులు అర్పించాయి. ఒక యువ నటుడ్ని కోల్పోయినందుకు బాధను వ్యక్తం చేస్తున్నారు.
undefined
నేషనల్‌ హెరాల్డ్ సంస్థ కథనం ప్రకారం.. దర్శక నిర్మాత మహేష్ భట్‌కు సన్నిహితుడైన జర్నలిస్ట్ సుహ్రిత సేన్‌ గుప్తా సంచలన విషయాలను వెల్లడించాడు.
undefined
`సడక్‌ సినిమా లో అవకాశం కోసం సుశాంత్ మహేష్ భట్‌ను మీట్‌ అయ్యేందుకు వచ్చాడు. సుశాంత్‌ ఎంతో మంచి మాటకారి, ఏ విషయం మీదైన మాట్లాడగలడు. క్వాంటమ్ ఫిజిక్స్‌ నుంచి సినిమాల వరకు అన్నింటి గురించి చర్చిస్తాడు` అంటూ చెప్పారు సుహ్రిత.
undefined
అయితే మహేష్‌ భట్‌ను కలిసి సమయానికే సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నాడు. సుశాంత్ బిహేవియర్‌లో తేడాను గుర్తించాడు.
undefined
గతంలో పర్వీన్‌ బాబీ డిప్రెషన్‌లో ఉన్న సమయంలో ఎలా బిహేవ్‌ చేసేదో అలాగే బిహేవ్ చేశాడు సుశాంత్‌ అని మహేష్ వెల్లడించినట్టుగా సుహ్రిత తెలిపారు. అయితే ఆయన ఆ పరిస్థితి నుంచి కోలుకోవడానికి ఒకే ఒక దారి మెడికేషన్‌ అని ఆయన గుర్తించినట్టుగా తెలిపారు. ఆ సమయంలో సుశాంత్ తోనే ఉన్న రియా, అతడిని మేడికేషన్‌ తీసుకోవాల్సిందిగా కోరినా సుశాంత్‌ నిరాకరించాడు.
undefined
మెడికేషన్‌ లేకపోవటంతో సుశాంత్ మానసిక పరిస్థితి దిగజారుతూ వచ్చింది. రియా ఎంత ప్రయత్నించిన సుశాంత్ తిరిగి మామూలు మనిషి కాలేకపోయాడు.
undefined
అంతేకాదు సుహిత్ర.. సుశాంత్ పరిస్థితి ఏ స్థాయికి వచ్చిందో కూడా వివరించాడు. `గత ఏడాదిలో సుశాంత్ తన సన్నిహితులందరికీ దూరమయ్యాడు. అప్పటికీ రియా అతనితోనే ఉన్నా మరింత కాలం కొనసాగలేకపోయింది. సుశాంత్‌కు ఎవరో తనతో మాట్లాడుతున్నట్టుగా అనిపించటం, ఎవరో తనను చంపాడానికి చూస్తున్నారిన అనిపంచటం మొదలైన తరువాత రియా అతనితో కలిసి ఉండలేకపోయింది. ఒక రోజు అనురాగ్ కశ్యప్‌ సినిమాను తన ఇంట్లో రియాతో కలిసి చూస్తూ `నేను కశ్యప్ సినిమాకు నో చెప్పాను. ఇప్పుడు అతను నన్ను చంపాలని చూస్తున్నాడు` అని భయపడ్డాడు. దీంతో సుశాంత్ పరిస్థితి చూసి రియా వణికిపోయింది. ఇక అతడితో కలిసి ఉండ కూడాదని నిర్ణయించుకుంది.
undefined
ఆ సమయంలో రియా, మహేష్‌ భట్‌ను సంప్రదించగా అతను కూడా నువ్వు చేసేది ఏమి లేదని చెప్పాడు. ఒకవేళ అప్పటి రియా అతనితోనే ఉండి ఉంటే ఆమె మానసిక పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారి ఉండేది. అప్పటికీ రియా, సుశాంత్‌ సోదరి ముంబై వచ్చే వరకు అతనితోనే ఉంది. సుశాంత్ సోదరి వచ్చిన తరువాత రియా వెళ్లిపోయింది. కానీ సోదరి చెప్పినా సుశాంత్ మెడికేషన్ తీసుకునేందుకు మాత్రం అంగీకరించలేదు అంటూ చెప్పారు సుహ్రీత.
undefined
దీంతో సుశాంత్ ఒంటరికగగా తనలోని భయాలతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు ఈ పోరాటంతో ఓడిపోయిన సుశాంత్ తనని తాను బలి చేసుకున్నాడు.
undefined
click me!