కొండ కోనల్లో రిలాక్స్ అవుతున్న హెబ్బా పటేల్.. రొటీన్ లైఫ్ బోర్ కొట్టినట్టుంది

First Published Sep 23, 2022, 8:38 AM IST

ఇండస్ట్రీలో నెట్టుకొస్తోంది హెబ్బా పటేల్.. మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. కెరీర్ కు బ్రేక్ ఇచ్చే సినిమా కోసం ఒపిగ్గా చూస్తోంది. ఆ ప్రెజర్ ను తట్టుకోలేకపోతుందో ఏమో..? కాస్త రొటీన్ లైఫ్ కు బ్రేక్ ఇచ్చి టూర్ ప్లాన్ చేసుకుంది.
 

కొండకోనల్లో విహరిస్తుంది హెబ్బా పటేల్. మౌంటెన్స్ ను బాగా మిస్ అవుతున్నా అంటూ ఓ పోస్ట్ ను పంచుకుంది.  సహజంగా ప్రకృతి ప్రేమికురాలు అయిన హెబ్బా.. ఆ ప్రకృతి అందంలో కలిసిపోయి.. మురిసిపోతోంది. నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో శేర్ చేసింది బ్యూటీ. 
 

కుమారి 21ఎఫ్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యింది హెబ్బా..  యూత్ లో మంచి ఫాలోయింగ్ కూడా తెచ్చుకుంది.  ఈ చిత్రంలో ఏకంగా బోల్డ్ సీన్లలో పెర్ఫామెన్స్ చేసి ఆడియెన్స్ ను కట్టిపడేసింది. 
 

కొంత కాలంగా అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంది హెబ్బా.. సినిమాల్లో తన జోరు తగ్గడంతో.. సోషల్ మీడియాలో జోరు పెంచేసింది.  హాట్ హాట్ ఫోటోస్ తో అదరగొడుతుంది, 
 

ఇక పెద్దగా అవకాశాలు రాక హేబా పటేల్ కు చిన్న సినిమాలు దిక్కయ్యాయి. రీసెంట్ గా ఆమె లీడ్ రోల్ చేసిన సినిమా ఓదెల రైల్వే స్టేషన్  రీసెంట్ గా ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా లో  రిలీజ్ అయ్యింది. ఇక ఈసినిమాకు ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్సాన్స్ వస్తోంది. 

రిలీజ్ అయిన అతి తక్కువ టైమ్ లోనే కోట్లలో ఫ్యూస్ ను సాధించింది సినిమా. హెబ్బా పెర్పామెన్స్ కు కూడా ఈ సినిమాలో మంచి పేరు వచ్చింది. ఈసినిమాతో మరోసారి లౌమ్ లైన్ లోకి రావాలని చూస్తోంది బ్యూటీ. 

 ప్రస్తుతం హేబా పటేల్ నటిస్తున్న సినిమాలు   తెలిసినవాళ్లు, గీత. ఈ సినిమాలు త్వరలో  రిలీజ్ కు ముస్తాబు అవుతున్నాయి.  అటు తమిళంలో కూడా వల్లన్, ఆద్య సినిమాల్లోను ఈ బ్యూటీ నటిస్తోంది.   

click me!