`భారతీయుడు 2` షూటింగ్ జరుగుతున్నప్పుడే దాని 3వ భాగాన్ని కూడా పూర్తి చేశారు శంకర్. అందులో ఇంకా ఒక పాట మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. కానీ ఇండియన్ 2 ఫలితాన్ని చూసి కొన్ని సన్నివేశాలను తిరిగి చిత్రీకరించాలని శంకర్ నిర్ణయించుకున్నారు, దానికి రూ.80 కోట్ల వరకు ఖర్చవుతుందని అడిగారట. అందులో ఆయన రూ.30 కోట్ల పారితోషికం కూడా ఉందట.
కానీ లైకా వారు, ఇండియన్ 2 సినిమా ఇప్పటికే పరాజయం పాలైంది కాబట్టి పారితోషికాన్ని తగ్గించి నిర్మాణ ఖర్చులు మాత్రమే ఇస్తామని చెప్పారట. దానితో పాటు ఇప్పటివరకు తీసిన `భారతీయుడు 3` సినిమాని విడుదల చేయమని అడిగారట. దానికి శంకర్ ఒప్పుకోలేదట. దీంతో ఇద్దరి మధ్యా మనస్పర్థలు కొనసాగుతున్నాయని సమాచారం.