Eesha Rebba: డైరెక్టర్‌ని పెళ్లి చేసుకోబోతున్న ఈషా రెబ్బా.. అసలు కథ ఇప్పుడే స్టార్ట్

Published : Dec 15, 2025, 06:40 PM IST

తెలుగు హీరోయిన్‌ ఈషా రెబ్బాకి పెద్దగా సినిమాలు లేవు. కొంత గ్యాప్‌తో ఇప్పుడే మళ్లీ బిజీ అవుతుంది. కానీ ఇంతలోనే ఆమెకి సంబంధించిన గుడ్‌ న్యూస్‌ వినిపిస్తోంది. డైరెక్టర్‌ని పెళ్లి చేసుకోబోతుందట. 

PREV
16
హీరోయిన్‌గా కమ్‌ బ్యాక్‌ అవుతోన్న ఈషా రెబ్బా

తెలుగు హీరోయిన్‌ ఈషా రెబ్బా ఒకప్పుడు హీరోయిన్‌గా రాణించి సక్సెస్‌ అయ్యింది. కానీ ఇటీవల కాలంలో ఆమెకి పెద్దగా సినిమాలు లేవు, వెండితెరపై కనిపించి కూడా చాలా రోజులు అవుతుంది. అడదపాదడపా వెబ్‌సిరీస్‌లు, ఓటీటీ ఫిల్మ్స్ లో మెరుస్తుంది. ఈ క్రమంలో ఇటీవల `3 రోజెస్‌ సీజన్‌ 2`లో నటించింది. ఈ బోల్డ్ సిరీస్‌లో ఈషా  కాస్త గ్లామరస్‌గానే కనిపించి మెప్పించింది. ఇది యువతని ఆకట్టుకుంటుంది. దీంతోపాటు వరుసగా సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది ఈషా రెబ్బా. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలుండటం విశేషం.

26
భార్యాభర్తలుగా తరుణ్‌ భాస్కర్‌, ఈషా రెబ్బా

ప్రస్తుతం తెలుగులో ఆమె `ఓం శాంతి శాంతి శాంతిః` అనే చిత్రంలో నటిస్తోంది. ఇది ఓ మలయాళ మూవీకి రీమేక్‌. ఇందులో దర్శకుడు, నటుడు తరుణ్‌ భాస్కర్‌కి జోడిగా చేస్తోంది ఈషా. దీనికి సంబంధించిన అప్‌ డేట్‌ ఆ మధ్యనే వచ్చింది. ఫస్ట్ లుక్‌, టీజర్‌లు వచ్చాయి. ఇందులో ఈషా రెబ్బా, తరుణ్‌ భాస్కర్‌ ఫోటో ఆకట్టుకుంది.  ఈ ఇద్దరు జంటగా కనిపించారు. సినిమాలో వీరిద్దరు భార్యాభర్తలుగా నటిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల వీరిద్దరు తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. ఆయా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

36
ప్రేమలో ఉన్న ఈషా రెబ్బా, తరుణ్‌ భాస్కర్‌

ఇదిలా ఉంటే ఈషా రెబ్బా, తరుణ్‌ భాస్కర్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తెగ వైరల్‌ అవుతుంది. ఈషారెబ్బా, తరుణ్‌ భాస్కర్‌ ప్రేమలో ఉన్నారనే వార్త హాట్‌ టాపిక్‌గా మారింది. అంతేకాదు త్వరలో ఈ ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. `ఓం శాంతి శాంతి శాంతిః` చిత్ర షూటింగ్‌లో ఈ ఇద్దరు కలిశారు. ఈ షూటింగ్‌ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారని సమాచారం. ఆ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లబోతున్నారట. వచ్చే ఏడాది మ్యారేజ్‌ కి ప్లాన్‌ చేసుకుంటున్నట్టు సమాచారం. ఈ ఇద్దరు వరంగల్‌కి చెందిన వారే కావడం విశేషం. ఇది కూడా వీరి మధ్య ప్రేమ మరింత బలపడటానికి కారణమని టాక్‌. 

46
పార్టీలు, ఫంక్షన్లకి కలిసే వెళ్తోన్న ఈషా, తరుణ్‌

ఇటీవల ఎటు వెళ్లినా ఈ ఇద్దరు కలిసే వెళ్తున్నారు. పార్టీలు, ఫంక్షన్లలోనూ ఇద్దరు కలిసే పాల్గొంటున్నారు.  రూమర్లకి మరింత బలం చేకూరిందని చెప్పొచ్చు. తరుణ్‌ సన్నిహిత వర్గాలు కూడా ఈ ప్రేమ మ్యాటర్‌ నిజమే అని అంటున్నాయి. కాకపోతే అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం లేదు.  ఇటీవల `రాజు వెడ్స్ రాంబాయి` సక్సెస్‌ ఈవెంట్‌లో యాంకర్‌ మీరు చూసిన గొప్ప ప్రేమ కథ ఏంటని ప్రశ్నించింది. దానికి భాస్కర్‌ స్పందిస్తూ, `నాదే, నా లైఫ్‌లోనే చూస్తున్నా, సాగుతా ఉంది` అని పేర్కొన్నాడు. దీనికి యాంకర్‌ స్పందిస్తూ నాకు పేరు తెలుసు, కానీ చెప్పను అని వెల్లడించడం విశేషం. 

56
`పెళ్లి చూపులు`తో తరుణ్‌ లైఫ్‌ టర్న్

ఇక తరుణ్‌ భాస్కర్‌కి ఇప్పటికే పెళ్లి అయ్యింది. కానీ ఆమెతో విడాకులు తీసుకున్నారు. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థాల కారణంగా విడిపోయినట్టు సమాచారం. కాకపోతే విడాకులకు సంబంధించిన వార్తని తరుణ్‌ అధికారికంగా ప్రకటించలేదు. చాలా కాలంగా ఒంటరిగానే ఉంటున్నా ఆయన ఈషా రెబ్బా ప్రేమలో పడ్డారని సమాచారం. ఇక తరుణ్‌ భాస్కర్‌ `పెళ్లిచూపులు` చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ మూవీ మంచి హిట్‌ అయ్యింది. విజయ్‌కి మంచి బ్రేక్‌ వచ్చింది. ఈసినిమాతోనే ఇటు తరుణ్‌ భాస్కర్‌, అటు విజయ్‌, మరోవైపు ప్రియదర్శి, ఇలా చాలా మంది లైఫ్‌ టర్న్ తీసుకుంది. ఆ తర్వాత `ఈ నగరానికి ఏమైంది`, `పిట్టకథలు`, `కీడా కోలా` వంటి చిత్రాలను రూపొందించారు తరుణ్‌. 

66
ఈషా రెబ్బా చేసిన సినిమాలు

ఇక ఈషా రబ్బా.. `లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌` చిత్రంతో నటిగా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. `అంతకు ముందు ఆ తర్వాత` చిత్రంతో హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. `బందిపోటు`, `అమితుమీ` చిత్రాలతో విజయాలు అందుకుంది. `దర్శకుడు`, `అ!`, `బ్రండ్‌ బాబు`, `అరవింద సమేత`, `సుబ్రమణ్యపురం`, `రాగల 24 గంటల్లో`, `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`, `మామా మశ్చీంద్ర` వంటి చిత్రాల్లో నటించింది. కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ ఇప్పుడు బిజీ అవుతుంది ఈషా రెబ్బా. ఇంతలోనే ఆమె పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్‌ అయ్యే ప్లాన్‌ కూడా చేసుకుంటుందట.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories