ఈ విషయాలను శ్రీలక్ష్మి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రాజేష్కు నలుగురు పిల్లలు పుట్టారు. పెళ్లి విషయంలో తలెత్తిన కారణంతోనే రాజేష్ మద్యానికి అలవాటు పడ్డారని శ్రీలక్ష్మి తెలిపింది. నలుగురిలో ముగ్గురు మగవారు కాగా ఐశ్వర్య ఒక్కతే అమ్మాయి. అయితే ఇద్దరు మగవారు మరణించారని ఆమె చెప్పుకొచ్చింది.
ఇద్దరిలో ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ప్రేమ విషయంలో తలెత్తిన సమస్యలతో సూసైడ్ చేసుకున్నాడని చెప్పుకొచ్చింది. కాగా రెండో అబ్బాయి కారులో 140 కి.మీ వేగంతో రోడ్డు డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదంలో మరణించాడు. ఇద్దరు కూడా కేవలం 20 ఏళ్లలోనే మరణించడం వారి కుటుంబంలో నెలకొన్న విషాదం.