ప్రియ, విక్రమ్ వాళ్ళ తాతయ్య సంతోషిస్తారు కానీ రాజ్యలక్ష్మి వాళ్ళు షాక్ అవుతారు. నువ్వు ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా ఇది నీకు పుట్టిన బుద్ధేనా లేకపోతే ఎవరైనా బలవంతం చేశారా అంటే కొడుకు మీద కేకలు వేస్తుంది రాజ్యలక్ష్మి.ఆయన వద్దన్నారు కానీ నా బలవంతం మీద వేసుకున్నారు అంటుంది దివ్య. తనకు తెలియకపోతే నీకు తెలియదా ఇన్నాళ్లు పద్ధతిగా పెంచుకున్నాను ఇప్పుడు దారి తప్పుతుంటే బాధనిపిస్తుంది అంటుంది రాజ్యలక్ష్మి. తరువాయి భాగంలో లాస్య ఇంటికి వస్తుంది తులసి. లాస్య కోరుకుంటున్న జీవితాన్ని, తను ఆశ పడుతున్న కెఫేని లాస్యకి వచ్చేలాగా చేస్తానని మాట ఇస్తుంది తులసి. ఈ విషయం తెలుసుకున్న నందు కోపంతో రెచ్చిపోతాడు.