డైరెక్టర్ తేజ టాలీవుడ్ లో తెరకెక్కించిన ఒకే తరహా సినిమా కథలపై సెటైర్లు వేశారు. సినిమా కథలు అయితే బాషా ఫార్ములా లేదా గుండమ్మ కథ ఫార్ములాతోనే ఉంటాయి అని అన్నారు.
డైరెక్టర్ తేజ దర్శకుడిగా 'చిత్రం' మూవీతో పరిచయమయ్యారు.ప్రేమ కథా చిత్రాలతో వరుస హిట్లు కొడుతూ టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారారు. జయం లాంటి సంచలన బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత తేజ ట్రాక్ తప్పారు. వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. 15 ఏళ్ళ తర్వాత నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో తేజ హిట్ కొట్టారు.
25
రెండు కథలు మాత్రమే ఉంటాయి
ఓ ఈవెంట్ లో డైరెక్టర్ తేజ మాట్లాడుతూ తనపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చే క్రమంలో తెలుగు సినిమాల కథలపై సెటైర్లు వేశారు. ఆయన ఏమన్నారంటే.. నాకు ఫ్లాపులు ఎదురవుతున్న టైంలో పదేళ్లకు పైగా తెలుగు సినిమా కథలని బాగా అబ్జెర్వ్ చేశాను. అన్ని సినిమాల్లో 2 కథలు మాత్రమే ఉన్నాయి. నేను ఆ కథలు ఏంటో చెబుతాను.. మీరు టైటిల్స్ ఊహించుకోండి.
35
బాషా ఫార్ములా
ఒక హీరో ఉంటాడు.. వేరే ఊళ్లోకి వెళతాడు. అక్కడ అందరిలో కలసిపోయి సామాన్యుడిలా బతుకుతుంటాడు. ఆటో తోలడమో, కారు డ్రైవర్ గానో పనిచేస్తుంటాడు. చిన్న చిన్న సహాయాలు చేస్తుంటాడు. ఇంటర్వెల్ లో బాబు గారు అంటూ ఒక వ్యక్తి అతడిని గుర్తు పడతాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్.. ఫ్లాష్ బ్యాక్ లో హీరో కానీ హీరో త్రండ్రి కానీ పెద్ద తోపు అయి ఉంటాడు. బాషా నుంచే ఇవే సినిమాలు చేస్తున్నారు.
రెండవ కథ వచ్చేసి హీరో విలన్ ఇంటికి పనోడిగా వెళతాడు. విలన్ కూతురినే ప్రేమిస్తాడు. ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. ఒక్కడికి మాత్రం తెలిసి ఉంటుంది. కానీ వాడికి నోరో చెయ్యో పడిపోయి ఉంటుంది. లేదా హీరో అతడిని బెదిరిస్తాడు. ఇది గుండమ్మ కథ ఫార్ములా. ఇవే కథలని తిప్పి తిప్పి తీస్తున్నారు. కానీ అందరూ తిట్టేది మాత్రం నన్నే. నేను ఏ సినిమా చేసినా జయం లాగే ఉంది అని తిడతారు. కానీ వాళ్ళు మాత్రం ఒకే కథతో ఏళ్ల తరబడి అవే సినిమాలు చేయొచ్చు. అదేంటో నాకు అర్థం కాదు అంటూ తేజ సెటైర్లు వేశారు.
55
తేజ చివరి సినిమా
ప్రేక్షకులు కూడా ఆ సినిమాలనే మళ్ళీ మళ్ళీ చూస్తూ సూపర్ హిట్స్ చేస్తున్నారు. ఇదేమి న్యాయం అని తేజ ప్రశ్నించారు. డైరెక్టర్ తేజ చివరగా రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా అహింస అనే మూవీ తెరకెక్కించారు. ఆ మూవీ డిజాస్టర్ అయింది.