సాయిపల్లవిపై దర్శకుడు సుకుమార్‌ సంచలన కామెంట్‌.. `లేడీ పవన్‌ కళ్యాణ్‌` అంటూ కితాబు.. హోరెత్తిన ప్రాంగణం..

Published : Feb 27, 2022, 10:27 PM IST

హీరోయిన్లలో నేచురల్‌ పర్ఫెర్మెన్స్ తో ఆకట్టుకుంటున్న సాయిపల్లవిపై క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ సంచలన కామెంట్‌ చేశారు. `లేడీ పవన్‌ కళ్యాణ్‌` అంటూ ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. 

PREV
16
సాయిపల్లవిపై దర్శకుడు సుకుమార్‌ సంచలన కామెంట్‌.. `లేడీ పవన్‌ కళ్యాణ్‌` అంటూ కితాబు.. హోరెత్తిన ప్రాంగణం..

శర్వానంద్‌, రష్మిక మందన్నా(Rashmika Mandanna) కలిసి నటించిన `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌(Aadavaallu Meeku Joharlu Pre Release Event) ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. దీనికి సాయిపల్లవి(Sai Pallavi), కీర్తిసురేష్‌తోపాటు దర్శకుడు సుకుమార్‌ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా హీరోయిన్లు కీర్తిసురేష్‌(Keerthy Suresh), రష్మిక మందన్నాల గురించి చెబుతూ వారి నటనని అప్రిషియేట్‌ చేశారు సుకుమార్‌. వీరు బెస్ట్ యాక్టర్స్ అని కొనియాడారు. వీరికి గ్యాంగ్‌ లీడర్‌ సమంత అంటూ ప్రశంసించారు. రష్మిక గురించి చెబుతూ ఆమె పేరు మర్చిపోవడం నవ్వులు పూయించింది. 

26

అయితే Sai Pallavi గురించి చెప్పడానికి దర్శకుడు సుకుమార్‌(Sukumar) ప్రయత్నించగా ప్రాంగణం మొత్తం అరుపులతో హోరెత్తిపోయింది. సుకుమార్‌ని మాట్లాడనివ్వకుండా అభిమానులు అరుపులతో మారుమోగిపోయేలా చేశారు. దీంతో సుకుమార్‌ షాక్‌ అయ్యారు. ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అది చూసిన సాయిపల్లవి సైతం తన ఆశ్చర్యాన్ని ఆనందాన్ని వ్యక్తంచేసింది. సుకుమార్‌కి చెవిలో ఏదో చెప్పింది. 

36

అయితే ఆభిమానులు నాన్‌ స్టాప్‌గా అరవడంతో ఆశ్చర్యపోయిన సుకుమార్‌ `నువ్వు లేడీ పవన్‌ కళ్యాణ్‌`(Lady Pawan Kalyan) అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. దీంతో మరోసారి `ఆడవాళ్లు మీకు జోహార్లు` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. వెనకాలు ఉన్న హీరోయిన్లు కీర్తిసురేష్‌, రష్మిక మందన్నాలుసైతం ఆశ్చర్యపోవడం విశేషం. ఈ సందర్బంగా సాయిపల్లవిపై ప్రశంసలు కురిపించారు సుకుమార్‌ అద్భుతమైన యాక్టన్‌ అని కొనియాడారు. అయితే ఇప్పటి వరకు ఆ విషయం చెప్పే అవకాశం రాలేదన్నారు. 

46

సాయిపల్లవి మంచి ఆర్టిస్ట్ అని, అదే సమయంలో మంచి హ్యూమన్‌ బీయింగ్‌ అని తెలిపారు. యాడ్‌ రిజక్ట్ చేయడం గొప్ప విషయం. ఇన్‌స్పైరింగ్‌గా ఉంటావని, ఎప్పటికీ ఆ విషయంలో గుర్తిండిపోతావని అభినందించారు సుకుమార్‌. మంచి నటి మాత్రమే కాదు, మంచి హ్యూమన్‌ బీయింగ్‌గా కూడాఉండగలగడం ఈ ఫీల్డ్ లో చాలా కష్టమని, అందుకు సాయిపల్లవిని అభినందించారుసుకుమార్‌.

56

అయితే ఆ తర్వాత సాయిపల్లవి మాట్లాడే సమయంలోనూ అభిమానులు మరోసారి హోరెత్తించారు. ఈవెంట్‌ మొత్తం దద్దరిల్లేలా చేశారు. మధ్యలో యాంకర్‌ సుమ కల్పించుకుని అభిమానులను నిలవరింపచేసే ప్రయత్నం చేసింది. అయితే అభిమానులు ఆ రేంజ్‌తో అరవడంతో సాయిపల్లవి స్పందిస్తూ,ఈ ఈవెంట్‌ మళ్లీ ఏడవడం బాగోదని, మళ్లీ ఏడవలేనని తెలిపింది. `శ్యామ్‌ సింగరాయ్‌` ఈవెంట్‌లో ఇదే స్థాయిలో అభిమానులు అరుపులతో హోరెత్తించడంతో సాయిపల్లవి  కన్నీళ్లు పెట్టున్న విషయం తెలిసిందే. దాన్ని గుర్తు చేస్తూ మీ ప్రేమకి ధన్యవాదాలు అని తెలిపింది. 

66

మరోవైపు ఈ ఈవెంట్‌కి తాను గెస్ట్ గా రాలేదని, కేవలం ఫ్యామిలీ మెంబర్‌లా వచ్చానని తెలిపింది. తనతో `పడి పడి లేచే మనసు` చిత్రం చేసిన నిర్మాతలకు ఈచిత్రం పెద్ద విజయం సాధించాలని తెలిపింది. అలాగే శర్వానంద్‌ తనకు ఫ్రెండ్‌ లాంటివారని, ఇప్పటికీ మంచి సినిమాలు చేయాలని వెతుక్కుంటారని తెలిపింది. మొత్తానికి `ఆడవాళ్లు మీకు జోహార్లు` ఈవెంట్‌లో అందరి కంటే హైలైట్‌ గా  నిలిచి అటు కీర్తిసురేష్‌, రష్మిక మందన్నాలు సైతం అసూయ పడేలా చేసింది సాయిపల్లవి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories