మోహన్ రాజా దమ్ము చూశారా.. ఛాలెంజ్ చేస్తూ 'గాడ్ ఫాదర్' పై షాకింగ్ కామెంట్స్

First Published Oct 4, 2022, 9:42 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ కి సర్వం సిద్ధం అయింది. ఆచార్య డిజాస్టర్ ఎఫెక్ట్ తో గాడ్ ఫాదర్ మూవీపై బిగినింగ్ లో బజ్ క్రియేట్ కాలేదు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ కి సర్వం సిద్ధం అయింది. ఆచార్య డిజాస్టర్ ఎఫెక్ట్ తో గాడ్ ఫాదర్ మూవీపై బిగినింగ్ లో బజ్ క్రియేట్ కాలేదు. కానీ ప్రమోషన్స్ జోరు పెరిగే కొద్దీ హైప్ మొదలయింది. మరికొన్ని గంటల్లో గాడ్ ఫాదర్ చిత్రం థియేటర్స్ లో సందడి చేయనుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతోంది. 

తాజాగా ఇంటర్వ్యూలో డైరెక్టర్ మోహన్ రాజా షాకింగ్ కామెంట్స్ చేశారు. మోహన్ రాజా వ్యాఖ్యలతో సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం ఖాయం. గాడ్ ఫాదర్ చిత్రం మలయాళీ బ్లాక్ బస్టర్ లూసిఫెర్ కి రీమేక్ గా తెరకెక్కుతోంది. రీమేక్ మూవీపై ఒరిజినల్ వర్షన్ ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇతర భాషా చిత్రాలు కూడా ఓటిటిలో లభిస్తున్నాయి. 

దీనితో ఒరిజినల్ వర్షన్ చూసిన ప్రేక్షకులు రీమేక్ ని పోల్చుతారు. లోపాలు వెతుకుతారు. ఆ టెన్షన్ గాడ్ ఫాదర్ చిత్ర యూనిట్ కి కూడా ఉంది. అయితే మోహన్ రాజా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ ని తెలియజేస్తున్నాయి. 

మీరు లూసిఫెర్ చూసి వచ్చినా నాకేం భయం లేదు. ఎందుకంటే లూసిఫెర్ చూసిన వాళ్ళకి కూడా గాడ్ ఫాదర్ కొత్తగా అనిపిస్తుంది. అద్భుతంగా నచ్చుతుంది. గాడ్ ఫాదర్ సినిమా మొదలు పెట్టక ముందు లూసిఫెర్ నేను కూడా చూశాను. నాకు సెకండ్ హాఫ్ లో కొత్త కోణం కనిపించింది. ఆ ఆలోచనలతో గాడ్ ఫాదర్ సెకండ్ హాఫ్ లో చాలా మార్పులు చేశాం. అది అద్భుతంగా వర్కౌట్ అయింది అని మోహన్ రాజా అన్నారు. 

మోహన్ రాజా కామెంట్స్ చూస్తుంటే సినిమాపై ఆయన కాన్ఫిడెన్స్  తెలియజేస్తోంది. గాడ్ ఫాదర్ చిత్రంలో మోహన్ రాజా చెప్పినట్లు ఫ్రెష్ ఫీలింగ్ ఉంటే దసరాకి కాసుల పంట ఖాయం. 

ఈ చిత్రంలో క్యారెక్టర్స్ ఎప్పటికీ గుర్తుండిపోయే ఇంపాక్ట్ ఇస్తాయని మోహన్ రాజా అంటున్నారు. క్యారెక్టర్స్ బలంగా ఉంటే సినిమా సగం సక్సెస్ అయినట్లే. చూద్దాం రేపు ఏం జరగబోతోందో.. 

click me!