ఇదిలా ఉండగా 'హిరణ్య కశ్యప' చిత్రం తెరకెక్కించడం గుణశేఖర్ డ్రీమ్. ఈ చిత్రం కోసం గుణశేఖర్ ఏళ్ల తరబడి కష్టపడుతున్నారు. సురేష్ బాబు నిర్మాణంలో, రానా దగ్గుబాటి టైటిల్ రోల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు గుణశేఖర్ ఎంతగానో శ్రమించారు. స్క్రిప్ట్ వర్క్ ని ఒక షేప్ కి తీసుకురావడం కోసం గుణశేఖర్ ప్రాణం పెట్టారు. 200 నుంచి 300 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దాలనేది గుణశేఖర్ కల.