కానీ ఇటీవల విడుదల చేసిన ట్రైలర్స్ తో పరిస్థితి కాస్త మెరుగుపడి మంచి బజ్ వచ్చింది. ఇటీవల తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అంచనాలు తారా స్థాయికి చేరాయి. కానీ దర్శకుడు ఓం రౌత్, కృతి సనన్ తిరుమల కొండపై హగ్గులు కిస్సుల వ్యవహారంతో ఆదిపురుష్ పై పాజిటివ్ బజ్ కాస్త పూర్తి నెగిటివ్ గా మారింది. వీరి వ్యవహారంతో నలువైపుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.