నేను కాబట్టి బయటపడ్డా, ఇంకొకరైతే సూసైడ్ చేసుకునేవారు.. స్టార్ హీరోల ఫ్లాప్స్ పై దిల్ రాజు

Published : Dec 29, 2022, 06:33 PM IST

ఒకప్పుడు దిల్ రాజు నిర్మించిన చిత్రాలు ఎలాంటి వివాదం, హడావిడి లేకుండా సైలెంట్ గా బాక్సాఫీస్ వద్దకు వచ్చి పెద్ద విజయాలుగా నిలిచేవి. కానీ ఇప్పుడు దిల్ రాజు ఏం చేసినా వివాదం అవుతోంది.

PREV
17
నేను కాబట్టి బయటపడ్డా, ఇంకొకరైతే సూసైడ్ చేసుకునేవారు.. స్టార్ హీరోల ఫ్లాప్స్ పై దిల్ రాజు

ఒకప్పుడు దిల్ రాజు నిర్మించిన చిత్రాలు ఎలాంటి వివాదం, హడావిడి లేకుండా సైలెంట్ గా బాక్సాఫీస్ వద్దకు వచ్చి పెద్ద విజయాలుగా నిలిచేవి. కానీ ఇప్పుడు దిల్ రాజు ఏం చేసినా వివాదం అవుతోంది. తాజాగా దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు చిత్రం వివాదాలకు కారణం అయింది. ఈ సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి చిత్రాలు విడుదలవుతున్నాయి. 

27

ఈ చిత్రాలతో పాటు దిల్ రాజు వారసుడు చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తున్నారు. దీనితో దిల్ రాజుపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. తెలుగు చిత్రాలకు నష్టం వాటిల్లేలా దిల్ రాజు ఒక డబ్బింగ్ చిత్రాన్ని తీసుకురావడం ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విమర్శలతో తన ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉండడంతో డైరెక్ట్ గా దిల్ రాజు రంగంలోకి దిగారు. 

37

చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతోందో చెబుతూ కుండబద్దలు కొట్టేశారు. టాలీవుడ్ లో కేవలం నిబంధనలు పేపర్లకి మాత్రమే పరిమితం. తేరా వెనుక ఎవరి అజెండాలు వాళ్ళకి ఉంటాయి. అందరూ చేసేది వ్యాపారమే అని దిల్ రాజు అన్నారు. కానీ అందరికి టార్గెట్ గా మారుతోంది మాత్రం నేనే. అందుకే నా వైఖరి మార్చుకోవాలనుకుంటున్నా. 

47

వారసుడు విషయంలో అనవసర రాద్ధాంతం జరుగుతోంది. నా గురించి అందరికి తెలిసింది కొంత మాత్రమే. చిత్ర పరిశ్రమలో నేను ఎన్ని రిస్క్ లు చేసానో ఎవరికీ తెలియదు. లోపల జరిగే విషయాలు సగం సగం మాత్రమే బయటకి వస్తాయి. నిర్మాతగా సినిమాలు చేస్తూనే డిస్ట్రిబ్యూటర్ గా ఫ్యాన్సీ అమౌంట్ కి చిత్రాలు కొంటున్నా. 

57

మగధీర సాధించిన దానికంటే మించి బాహుబలి చిత్రాన్ని అమ్మితే నేను కొన్నా. నచ్చితే ఎంత దూరం అయినా వెళతా. ఆ క్రమంలో అజ్ఞాతవాసి, స్పైడర్ చిత్రాల వల్ల డిస్ట్రిబ్యూటర్ గా చాలా నష్టపోయి. ఆ రెండు చిత్రాలు బాగా దెబ్బ తీశాయి. ఇంకెవరైనా అయితే ఆత్మహత్య చేసుకుని ఉంటారు లేదా ఇండస్ట్రీ నుంచి పారిపోయి ఉంటారు. నేను కాబట్టి తట్టుకుని నిలబడగలిగా అని దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

67

వారసుడు విషయంలో వివాదం ఎందుకో అర్థం కావడం లేదు. నైజాంలో కూడా సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ప్రారంభించిన మైత్రి మూవీస్ వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తా. అయితే నా విలువ వాళ్ళకి మున్ముందు తెలుస్తుంది అని దిల్ రాజు పేర్కొన్నారు. 

77
Dil raju

సంక్రాంతికి రెండు మూడు చిత్రాలు పోటీ పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అది తప్పదు. ఎందుకంటే సంక్రాంతి సినిమా సీజన్. మూడు చిత్రాలు బావుంటే మూడింటికి కలెక్షన్స్ వస్తాయి అని దిల్ రాజు అన్నారు. నేను తెలుగు ప్రొడ్యూసర్ ని, వంశి పైడిపల్లి తెలుగు డైరెక్టర్.. కాబట్టి వారసుడు విషయంలో వివాదం అనవసరం అని దిల్ రాజు అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories