‘పొన్నియిన్ సెల్వన్’ కోసం ఐశ్వర్య రాయ్ అంత ఛార్జ్ చేసిందా! మిగిలిన స్టార్స్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

First Published Oct 2, 2022, 1:37 PM IST

కోలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో రూపొందిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’. ఈ చిత్రంలో స్టార్ హీరోహీరోయిన్లు నటించారు. అయితే ఈ సినిమాకు వీరు తీసుకున్న రెమ్యూనరేషన్ షాకింగ్ ఉంది.  
 

తమిళ చిత్ర పరిశ్రమలో ‘బాహుబలి’ తరహాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’(Ponniyin Selvan 1). సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాజిటివ్ టాక్ తో మాత్రం దూసుకుపోతోంది. 
 

దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) డ్రీమ్ ప్రాజెక్ట్ గా చిత్రం తెరకెక్కింది. మునుపెన్నడూ లేనివిధంగా తమిళ స్టార్ హీరోలు చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, హీరోయిన్లు  త్రిష, శోభితా ధూళిపాళలో పాటు బాలీవుడ్ బ్యూటీ, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) కూడా హీరోయిన్ గా నటించడంతో చిత్రం హైప్ క్రియేట్ చేసింది.
 

ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అత్యాద్భుతమై నిర్మాణ విలువలతో, భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రంలో నటీనటులు కూడా భారీగానే రెమ్యూనరేన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఐశ్వర్యారాయ్ రెమ్యూనరేషన్ షాకింగ్ గా ఉంది.

చిత్రంలో బాలీవుడ్ అందాల సుందరి ఐశ్వర్య రాయ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. గతంలోనే చియాన్ విక్రమ్ (Chiyan Vikram)తో నటించిన ఐషు మరోసారి ‘పొన్నియిన్ సెల్వన్’లో అదరగొట్టింది. రాణి నందిని పాత్రలో అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చిన ఐశ్వర్యా రాయ్ రూ.10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. 

ఇక ప్రధాన పాత్రలో నటించిన చియాన్ విక్రమ్ రూ.12 కోట్లు తీసుకున్నాడంట. ఇక తమిళ స్టార్ హీరో జయం రవి రూ.8 కోట్లు, కార్తీ రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే  హీరోయిన్ త్రిష రూ.2.5 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుందట. అందుకే ఈ భారీ రెమ్యూనరేషన్ అందుకున్న తారలు ప్రమోషన్స్ లోనూ పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.
 

ప్రస్తుతం ఉన్న భారీ చిత్రాల్లో ‘పొన్నియిన్ సెల్వన్’ ఒక్కటే పెద్ద సినిమా కావడం విశేషం. దీంతో ప్రేక్షకులు మూవీని థియేటర్లలోనే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రం రెండు పార్టులుగా విడుదల కానుండగా.. ప్రస్తుతం పార్ట్ 1ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రెండో భాగాన్ని త్వరలోనే తీసుకురానున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

click me!