హేమమాలిని డెలివరీ కోసం 100 రూమ్స్ బుక్ చేసిన ధర్మేంద్ర.. చాలా ఏళ్ల తర్వాత బయటపడ్డ సీక్రెట్..

First Published May 9, 2024, 9:58 AM IST

హేమ మాలిని మొదటి డెలివరీ కోసం ఆమె భర్త  ధర్మేంద్ర..ఓ పెద్ద సాహసమే చేశాడట. ఆయన ఏకంగా  హాస్పిటల్ మొత్తాన్ని బుక్ చేశాడట.
 

బాలీవుడ్ లెజెండరీ జంటలలో హేమమాలిని మరియు ధర్మేంద్ర ఒకరు. అప్పట్లో స్టార్ హీరోగా ధర్మేద్ర, డ్రీమ్ గర్ల్ గాహేమా మాలిని ఎంతో ఫేమస్ అయ్యారు.  ఈ జంట 1980లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి మొదటి సంతానంగా ఈషా డియోల్  1981 నవంబర్ లో పుట్టారు. 
 

అయితే ఆ సమయంలో హేమ మాలిని గర్భవతి  అన్న సంగతి అప్పటి వరకూ.. ఎవరికీ తెలియదు.  ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులకు బయట చాలామందికి తెలియదట. చాలాదగ్గరి వారికి మాత్రమే ఈ విషయంలో క్లారిటీ ఉన్నట్టు తెలుస్తోంది. 
 

కూతుర్ని చూసి గర్వపడుతున్న సూర్య - జ్యోతిక, ఇంతకీ ఆమె ఏం సాధించిందో తెలుసా..?

హేమమాలిని హిందీ సినిమా డ్రీమ్ గర్ల్ గా పేరుతెచ్చుకున్నారు. అయితే ఆమె ధర్మేంద్రకు రెండో భార్యగా వెళ్ళారు. ధర్మేంద్రకు ఇందకు ముందే  ప్రకాష్‌ కౌర్‌తో  పెళ్లయి ఉండటంతో వీరిద్దరి పెళ్లి చాలా పెద్ద వివాదానికి దారి తీసిందట అప్పట్లో. 

మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా..? అప్పట్లో పెద్ద సంచలనమే..?

హేమ మాలిని తన మొదటి బిడ్డకు జన్మనిచ్చే టైమ్ లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారట ధర్మేంద్ర. తను డెలివరీకి హాస్పిటల్ లో చేరిందన్న సంగతి కూడా  ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారట. ఈ విషయం సీక్రేట్ గా ఉంచడం కోసం చాలా పెద్ద సాహసమే చేశాడట ధర్మేంద్ర. 
 

ఎన్టీఆర్ - కె. విశ్వనాథ్ 20 ఏళ్లు మాట్లాడుకోలేదా..? కారణం ఏంటి..? విభేదాలు ఎక్కడ వచ్చాయి..?

ఇంతకీ  ధర్మేంద్ర ఏం చేశాడంటే.. హేమా మాలిని కోసం తాను చేరిన ఆ హాస్పిటల్ మొత్తాన్ని బుక్ చేశాడు. అందులో మొత్తం 100 గదులు ఉండగా..వాటన్నింటికి  బుక్ చేశాడు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెళ్ళడించారు  హేమ మాలిని స్నేహితురాలు నీతూ కోహ్లి. ఆ సంఘటనకు సంబంధించిన జ్ఞాపకాలను ఆమె  పంచుకున్నారు.
 

ప్రీతి జింటా టాలీవుడ్ రీ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ..

ఆమె మాట్లాడుతూ.. అప్పుడు ఈషా పుట్టే టైమ్ లో.. ప్రసవం కోసం హాస్పిటల్ లో జాయిన్ చేశారు.. అయితే  హేమ గర్భవతి అని ఎవరికీ తెలియదు, అందుకే ధర్మేంద్ర జీ హేమా కోసం హాస్పిటల్ మొత్తాన్ని బుక్ చేశాడు అని అన్నారు నీతూ. అయితే ఈ విషయం అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదట. తాజాగా ఇన్నేళ్ల తరువాత నీతూ చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ టాపిక్ అటు బాలీవుడ్ తో పాటు.. ఫిల్మ్ ఇండస్ట్రీ అంతట హాట్ టాపిక్ అయ్యింది. 

click me!