బాలీవుడ్ లెజెండరీ జంటలలో హేమమాలిని మరియు ధర్మేంద్ర ఒకరు. అప్పట్లో స్టార్ హీరోగా ధర్మేద్ర, డ్రీమ్ గర్ల్ గాహేమా మాలిని ఎంతో ఫేమస్ అయ్యారు. ఈ జంట 1980లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి మొదటి సంతానంగా ఈషా డియోల్ 1981 నవంబర్ లో పుట్టారు.
ఇంతకీ ధర్మేంద్ర ఏం చేశాడంటే.. హేమా మాలిని కోసం తాను చేరిన ఆ హాస్పిటల్ మొత్తాన్ని బుక్ చేశాడు. అందులో మొత్తం 100 గదులు ఉండగా..వాటన్నింటికి బుక్ చేశాడు. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెళ్ళడించారు హేమ మాలిని స్నేహితురాలు నీతూ కోహ్లి. ఆ సంఘటనకు సంబంధించిన జ్ఞాపకాలను ఆమె పంచుకున్నారు.
ప్రీతి జింటా టాలీవుడ్ రీ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ..
ఆమె మాట్లాడుతూ.. అప్పుడు ఈషా పుట్టే టైమ్ లో.. ప్రసవం కోసం హాస్పిటల్ లో జాయిన్ చేశారు.. అయితే హేమ గర్భవతి అని ఎవరికీ తెలియదు, అందుకే ధర్మేంద్ర జీ హేమా కోసం హాస్పిటల్ మొత్తాన్ని బుక్ చేశాడు అని అన్నారు నీతూ. అయితే ఈ విషయం అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదట. తాజాగా ఇన్నేళ్ల తరువాత నీతూ చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ టాపిక్ అటు బాలీవుడ్ తో పాటు.. ఫిల్మ్ ఇండస్ట్రీ అంతట హాట్ టాపిక్ అయ్యింది.