ధనుష్, ఇందుజా కలిసి నటిస్తున్న ‘నేను వస్తున్నా’ చిత్రానికి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. వీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత కలైపులి ఎస్. థాను నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మూవీలో ధనుష్ కౌబాయ్గా కనిపించనున్నాడు. అలాగే ద్విపాత్రాభినయంలో ఆకట్టుకోనున్నారు. ‘మయక్కం ఎన్నా’ తర్వాత సెల్వరాఘవన్, ధనుష్ కాంబోలో వస్తున్న చిత్రమిది. తాజాగా ఈ చిత్రం నుంచి `వీరా సూర ధీర రారా.. `అంటూ సాగే పాటని విడుదల చేశారు. దీనికి చంద్రబోస్ సాహిత్యం అందించగా, రాహుల్ నంబియార్ ఆలపించారు. ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటూ ట్రెండ్ అవుతుంది.