ధనుష్ని విమర్శించిన నయనతార
ధనుష్ నోటీసులు చూసి షాక్ అయిన నయనతార, అతనికి కౌంటర్ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో, ఆయనను తీవ్రంగా విమర్శించింది నయనతార. ప్రతీ సినిమా ఫంక్షన్ లో అతను మాట్లాడేవన్నీ అబద్దాలని, స్టేజ్ మీద అతను నటిస్తాడని , ఆయన నిజస్వరూపం వేరని విమర్శించారు. దీంతో నయనతారపై ధనుష్ కేసు వేశారు, ప్రస్తుతం అది విచారణలో ఉంది.
తనను విమర్శించి మాట్లాడిన నయనతారకు ఎలాంటి కౌంటర్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నాడు ధనుష్. ఎప్పుడు పబ్లిక్ గా ఏం మాట్లాడలేదు. కాని అటు నయనతార ఫ్యాన్స్ కొంత మంది మాత్రం సోషల్ మీడియాలో ధనుష్ ను విమర్శించారు. ఇటు ధనుష్ ఫ్యాన్స్ కూడా నయన్ ను విమర్శించారు. ఇక తాజాగా ఈ వివాదంపై ఇండైరెక్ట్ గా స్పందించాడు హీరో ధనుష్, కుబేరా సినిమా ఆడియో లాంచ్ ఫంక్షన్లో కాస్త ఆవేశంగా మాట్లాడారు.