సోషల్ మీడియా హీరోయిన్లకి ఆదాయ వనరుగా మారింది. వీరంతా నిత్యం అందాల ఫోటోలు పంచుకుంటూ తమ ఫాలోయింగ్ని పెంచుకుంటుంటారు. నెటిజన్లని ఎంగేజ్ చేస్తుంటారు. కానీ ఇలా బ్యాక్ టూ బ్యాక్ ఫోటోలకు పోజులిస్తూ,అందాలను నెటిజన్లకి ఎరగా వస్తున్నారు. వారిని నిత్యం ఎంగేజ్ చేస్తున్నారు. అయితే వీటి వల్ల ఏంటీ ప్రయోజనం అనుకునే వాళ్లు చాలా మందే. అభిమానులైతే హీరోయిన్ల అందాలు చూడటానికి పరిమితం అవుతుంటాయి. కానీ వారు ఫోటోలు పంచుకోవడం వెనకాల ఉన్న అసలు కారణం ఏంటో తెలియదు. కానీ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా అకౌంట్ల ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. కోట్లు గడిస్తున్నారు.
హీరోయిన్లు తమ సోషల్ మీడియా అకౌంట్ల ఫాలోవర్స్ ఎంత పెరిగితే అంత ఎక్కువ డబ్బు వస్తుండటం విశేషం. వీరికి మిలియన్స్ ఫాలోవర్స్ ఉండటంతో కమర్షియల్ యాడ్స్ వస్తుంటాయి. హీరోయిన్లు కమర్షియల్ యాడ్లని ప్రమోట్ చేస్తూ పోస్ట్ లు పెడుతుంటారు. ఆ పోస్ట్ వెనకాల కోట్ల లావాదేవీలు జరుగుతుండటం విశేషం. మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్లు ఒక్కో పోస్ట్ కి కోటికి పైగా పారితోషికం అందుకుంటుండటం విశేషం. దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, అలియాభట్, అనుష్క శర్మ, దిశా పటానీ, కియారా అద్వానీ, జాన్వీ కపూర్, కృతి సనన్, అనన్య పాండే వంటి కథానాయికలు ఒక్కో పోస్ట్ ఎంత తీసుకుంటున్నారో తెలుసుకుందాం.
బాలీవుడ్ని ఓ ఊపుఊపేస్తూనే తెలుగులోకి ప్రభాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది దీపికా పదుకొనె. ఆమె `ప్రాజెక్ట్ కే`లో హీరోయిన్గా నటిస్తుంది. పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ భామకి ఇన్స్టాగ్రామ్లో 67.2మిలియన్స్ ఫాలోవర్స్ ఉండగా, ఒక్క కమర్షియల్ పోస్ట్ కి కోటీ యాభై లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటుండటం విశేషం.
ఇక గ్లోబల్ బ్యూటీకి పేరు తెచ్చుకున్న ప్రియాంక చోప్రాకి ఇన్స్టాగ్రామ్లో 79.2మిలియన్స్ ఫాలోవర్స్ ఉండగా, ఆమె ఒక్కో పోస్ట్ కి కోటీ ఎనబై లక్షలు పారితోషికం తీసుకుంటుందని టాక్.
అలాగే ఇటీవల `ఆర్ఆర్ఆర్`తో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన అలియాభట్ సైతం భారీగానే తీసుకుంటుంది. ఈ అమ్మడికి 66.3 మిలియన్స్ ఇన్స్టా ఫాలో వర్స్ ఉండగా, కోటీ రూపాయలు ఒక్కో పోస్ట్ కి తీసుకుంటుందని సమాచారం.
తెలుగులో `మల్లీశ్వరి` చిత్రంతో ఆకట్టుకున్న కత్రినా కైఫ్కి ఇన్స్టాగ్రామ్లో 65.1 మిలియన్స్ ఫాలోవర్స్ ఉండగా, ఆమె ఒక్కో కమర్షియల్ పోస్ట్ కి కోటీ ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేస్తుందట.
కోహ్లి వైఫ్, స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకి ఇన్స్టాలో 58.9 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె ఒక్కో కమర్షియల్ పోస్ట్ కి కోటీ రూపాయలు తీసుకుంటుందట. భర్త టీమిండియా మాజీ కెప్టెన్ కావడంతో ఈ భామకి భారీ డిమాండ్ ఉందని చెప్పొచ్చు.
తెలుగులో `భరత్ అనే నేను`, `వినయ విధేయ రామ` చిత్రాలతో ఆకట్టుకున్న కియారా అద్వానీకి 23.5 మిలియన్స్ ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అమ్మడు ఒక్కో పోస్ట్ కి 70-8-లక్షలు తీసుకుంటుందట. మహేష్తో `వన్ నేనొక్కడినే` చిత్రంలో నటించిన కృతి సనన్ ఇప్పుడు `ఆదిపురుష్`లో చేస్తుంది. ఆమె 49.2 మిలియన్స్ ఫాలోవర్స్ ఉండగా, ఒక్కో పోస్ట్ కి 60-70లక్షలు తీసుకుంటుందట.
తెలుగులో `లోఫర్` చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన దిశా పటానీ బాలీవుడ్లో హాట్ బాంబ్గా పేరుతెచ్చుకుంది. ఆమెకి ఇన్స్టాగ్రామ్లో 51.7 మిలియన్స్ ఫాలోవర్స్ ఉండగా, ఒక్కో కమర్షియల్ పోస్ట్ కి 80లక్షలు తీసుకుంటుందని బాలీవుడ్ టాక్. అలాగే బెబో కరీనా కపూర్కి కేవలం 9.2 మిలియన్ ఇన్స్టాగ్రామ్ ఫాలో వర్స్ ఉన్నారు. కానీ ఆమె కూడా ఎనభై లక్షల వరకు తీసుకుంటుందట.
మరోవైపు యంగ్ బ్యూటీస్ జాన్వీ కపూర్, అనన్య పాండే, సారా అలీ ఖాన్లకు కూడా సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. జాన్వీకి 17.3 మిలియన్స్ ఫాలోవర్స్, అనన్యకి 22.7 మిలియన్స్, 40.3 మిలియన్స్ ఫాలోవర్స్ ఉండగా, వీరు బ్రాండ్ని బట్టి యాభై లక్షల లోపు పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇలా సోషల్ మీడియా ద్వారా భారీగానే సంపాదిస్తున్నారీ అందాల ముద్దుగుమ్మలు.