సౌత్ లో వచ్చిన బోల్డ్ క్రైమ్ చిత్రాలలో దండుపాళ్యంకి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుంచి మూడు భాగాలు వచ్చాయి. దండుపాళ్యం సిరీస్ తో నటి పూజా గాంధీ బోల్డ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అంతకు ముందు కూడా ఆమె పలు చిత్రాల్లో నటించింది. విజయవంతమైన చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది మాత్రం దండుపాళ్యం అనే చెప్పాలి.