కలర్స్ పేరుతో మా టీవీలో ప్రసారమైన షోతో స్వాతి పాపులర్ అయ్యారు. టీనేజ్ లోనే బుల్లితెరను దున్నేసింది అమ్మడు. విపరీతంగా అభిమానులను సంపాదించింది. స్వాతి సెన్సాఫ్ హ్యూమర్, ఎనర్జీ, గలగలా మాట్లాడే తత్త్వం ఆమెను స్టార్ చేశాయి. అలా వచ్చిన ఫేమ్ తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చేసింది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన డేంజర్ చిత్రంతో వెండితెరపై మొదటిసారి కనిపించింది.