ఎప్పుడూ ప్రభుత్వ కార్యకలాపాలతో తీరికలేకుండా గడిపే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం సాయంత్రం కాస్త రిలాక్ట్ అయ్యారు. సరదాగా అందరు కలిసి వచ్చి సినిమా చూశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి `ఫూలే` సినిమా చూశారు. సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే జీవిత చరిత్ర ఆధారంగా 'పూలే' సినిమాను రూపొందించారు.
అనంత్ మహదేవన్ దర్శకత్వంలో ప్రముఖ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర నిర్మించిన ఈ మూవీ గతేడాది ఏప్రిల్ 25న హిందీలో విడుదలైంది. చిత్రంలో జ్యోతిరావు పూలేగా ప్రతీక్ గాంధీ, సావిత్రీబాయి పూలేగా పత్రలేఖ పాల్ నటించారు. ఈ సినిమాని వీక్షించిన వారిలో సీఎం రేవంత్రెడ్డితోపాటు డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకట స్వామి, శ్రీధర్ బాబు, పొన్నంప్రభాకర్, వాకిటి శ్రీహరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.