నాగ్ అశ్విన్ ఇప్పుడు ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్, అట్లీ, సిద్ధార్థ్ ఆనంద్, సందీప్ రెడ్డి వంగా వంటి టాప్ కలెక్టెడ్ డైరెక్టర్ కేటగిరిలో చేరిపోతారు. ఆయన రూపొందించిన `కల్కి 2898ఏడీ` ఇప్పటికే బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుంది. ఐదు రోజుల్లోనే ఈ సినిమా సుమారు ఆరు వందల కోట్ల గ్రాస్ సాధించడం విశేషం. సోమవారం కలెక్షన్లు ఎలా ఉంటాయో అనే డౌట్ ఉండేది. కానీ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం బెటర్ కలెక్షన్లు ఉన్నాయని తెలుస్తుంది. ఈ లెక్కన ఈ మూవీ ఈజీగా వెయ్యి కోట్లు దాటుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగ్ అశ్విన్ సినిమాలకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. చిరంజీవితో సినిమాకు సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వలో చిరంజీవి సినిమా ఉండబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. దీంతో ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా అనే టాక్ ప్రారంభమైంది.
చిరంజీవి.. గతంలో `మహానటి` సినిమా టైమ్లో నాగ్ అశ్విన్ ని, ఆయన టీమ్ని అభినందించారు. సినిమా చాలా బాగుందని తెలియజేశారు. అంతేకాదు ఈ సందర్భంగా చిరు తన మనసులోని మాటని బయటపెట్టాడు. తనకు ఫోక్లోర్ సినిమాలు చేయాలని ఉందన్నారు. మాయలు, మంత్రాలు ఉండే చిత్రాలంటే ఇష్టమని, అలాంటి సినిమాలు చేయాలనుకున్నారు. ఈ విషయాన్ని నాగ్ అశ్విన్కి తెలిపారు. నాగ్ ఇలాంటి కథ రెడీ చేస్తే సినిమా చేసేందుకు రెడీ అన్నట్టుగా తెలిపారు చిరు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.
నాగ్ అశ్విన్ `కల్కి`తో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాకి రెండో పార్ట్ కూడా ఉంది. నెక్ట్స్ పార్ట్ 2పైనే ఫోకస్ పెట్టబోతున్నారు. ఆ తర్వాత అయినా చిరంజీవితో ప్రాజెక్ట్ ఉంటుందా? నాగ్ చిరు మాటలను సీరియస్గా తీసుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏ జరుగుతుందో గానీ, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా `పాతాళభైరవి` లాంటి సినిమా అనే చర్చనే ఆసక్తికరంగా, క్రేజీగా అనిపిస్తుంది.
ప్రస్తుతం చిరంజీవి సోషయో ఫాంటసీ చిత్రం చేస్తున్నారు. వశిష్ట దర్శకత్వలో `విశ్వంభర` అనే సినిమాలో నటిస్తున్నారు. పురాణాలు, సోషల్ ఎలిమెంట్లు మేళవించి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్డెట్తో, భారీ కాస్టింగ్తోనే దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్. మీనాక్షి చౌదరి, సురభి, ఈషా చావ్లా వంటి భామలు మెరవబోతున్నారట.