నాన్ వెజ్ లేనిదే ముద్దదిగేది కాదట. ఏరోజైనా నాన్ వెజ్ వండకపోతే ఇట్లో గోల చేసేవాడట. అప్పట్లో చిరంజీవి చాలా బిజీగా ఉండేవాడు. హీరోగా సక్సెస్ అయిన నేపథ్యంలో రెండు మూడు షిఫ్ట్ ల్లోనూ సినిమాలు చేసేవారు. అర్థరాత్రి ఎప్పుడో వచ్చేవారు. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఈ విషయం చిరంజీవికి తెలిసింది. ఓ రోజు ఇలానే తన ముందే అమ్మపై అరిచాడట పవన్.
దీంతో ఆయన్ని దగ్గరికి పిలిపించి.. ఒక్కసారి బయటకు వెళ్లి చూడు, మనం ఈ మాత్రం అయినా ఫుడ్ తింటున్నాం, మనకు దొరుకుతుంది, బయటకు చాలా మంది కనీసం ఒక్క పూట కూడా తినలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఉన్నదాన్ని సర్దుకుని పోవాలి, ఇలా బెట్టు చేస్తే బాగోదు అని కూల్గానే స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడట. ఇలాంటిది చేయోద్దని చెప్పాడట.