రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ సరసన చందూ మొండేటి!... మరో పాన్ ఇండియా దర్శకుడు దొరికినట్లే!

First Published Sep 3, 2022, 5:05 PM IST

సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమ పాన్ ఇండియా హీరోల కర్మాగారంగా మారింది. టాలెంటెడ్ డైరెక్టర్స్ ఒక్కొక్కరిగా బాలీవుడ్ లో సత్తా చాటుతూ తామేంటో నిరూపిస్తున్నారు. 
 

Chandoo Mondeti

చందు మొండేటి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ దర్శకుడు పేరు ఇప్పుడు ఇండియా అంతా వినిపిస్తోంది. దానికి కారణం కార్తికేయ 2. కృష్ణ తత్వం బోధిస్తూ శ్రీకృష్ణుడే నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే కాదు.. మిగిలిన అన్ని భాషల్లో మరీ ముఖ్యంగా హిందీలో కూడా అద్భుతమైన విజయం సాధించింది. కేవలం 50 స్క్రీన్స్ లో విడుదలైన ఆ సినిమా ఇప్పుడు 1000 స్క్రీన్స్ కు పైగానే ఆడుతుంది.

ఇప్పటికే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా.. ఇప్పటికీ అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తుంది. కార్తికేయ 2 సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు చందు మొండేటికి అన్ని వైపుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఈయనకు ఎంతమంది అగ్ర దర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఈ మధ్య పవన్ కళ్యాణ్, చిరంజీవి కూడా కార్తికేయ 2 సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాజాగా ఓ సినిమా ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. త్రిబుల్ ఆర్, కేజిఎఫ్, పుష్ప తర్వాత కార్తికేయ 2కే అంత పేరు వచ్చిందని తెలిపారు. తద్వారా చందు మొండేటి కూడా రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ సరసన పాన్ ఇండియా దర్శకుల లిస్టులో చేరిపోయారు.
 

కంటెంట్ ఉంటే ఎక్కడైనా రాణించవచ్చని చందూ మొండేటి మరోమారు నిరూపించారు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా బాలీవుడ్ లో విడుదల చేసిన విజయం సాధించారు. కార్తికేయ 2 ఇప్పటి వరకు దాదాపు రూ. 40 కోట్ల ప్రాఫిట్ రాబట్టినట్లు సమాచారం. భారీ బడ్జెట్ చిత్రాలకు కూడా ఈ రేంజ్ లాభాలు రావు. అంటే ఇది డబుల్ కాదు ట్రిఫుల్ బ్లాక్ బస్టర్ అన్నమాట. ఈ క్రమంలో చందూ మొండేటిని సౌత్ నుండి మరో పాన్ ఇండియా డైరెక్టర్ అంటున్నారు. 

రాజమౌళి, చిరంజీవి లాంటి ప్రముఖుల ప్రశంసలు అందుకున్న చందూ మొండేటి నెక్స్ట్ భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తే బెటర్. తనకు అచ్చొచ్చిన మంచి విజయాలు అందించిన కార్తికేయ 3 పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించే సూచనలు కలవు. కార్తికేయ 3 మేకర్స్ ఇప్పటికే ప్రకటించడం విశేషం. పార్ట్ 2 సక్సెస్ నేపథ్యంలో సీక్వెల్ పై మంచి హైప్ ఏర్పడుతుంది. 

చందూ మొండేటి కెరీర్ పరిశీలిస్తే 2014లో విడుదలైన కార్తికేయ చిత్రంతో డైరెక్టర్ అయ్యారు. డెబ్యూ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఆయన వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు. ప్రేమమ్ రీమేక్ పర్లేదు అనిపించినా కిరాక్ పార్టీ, సవ్యసాచి, నిరాశపరిచాయి. కార్తికేయ 2తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. 


కాగా విక్రమ్ మూవీతో లోకేష్ కనకరాజ్ పేరు విపరీతంగా వినిపిస్తుంది. విక్రమ్ హిందీలో ప్రభావం చూపనప్పటికీ పాన్ ఇండియా చిత్రాల దర్శకుడిగా ఇండస్ట్రీ అయ్యని గుర్తిస్తుంది. విక్రమ్ దాదాపు రూ. 400 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. అలాగే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ లో వశిష్ట్ ఈ మధ్య కాలంలో ఫేమస్ అయ్యాడు ఆయన తెరకెక్కించిన బింబిసార రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. భవిష్యత్ లో వశిష్ట్ పాన్ ఇండియా దర్శకుడు అవుతాడనిపిస్తోంది.  

click me!