బాలీవుడ్‌ హాట్‌ భామ సోనమ్‌.. అంత గరం ఎందుకో?

First Published Sep 3, 2020, 8:33 PM IST

అనిల్‌ కపూర్‌ తనయ, స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ గరం గరం అవుతోంది. ఎందుకో తెలియదు.. ఏంటో తెలియదు.. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఎవరి మీదనో మొత్తంగా ఫైర్‌ అవుతుంది. చాలా ఘాటుగా స్పందించింది. 

సోనమ్‌ కపూర్‌ తాజాగా ట్విట్టర్‌ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో కొందరిని పందులతో పోల్చింది. వారితో ఉంటే మనపై బురద జల్లుతారని పేర్కొంది. ఈ మేరకు రచయిత జార్జ్బెర్నార్డ్ షా కొటేషన్‌ పంచుకుంది.
undefined
ఇందులో సోనమ్‌ చెబుతూ, `నేను చాలా కాలం క్రితం నేర్చుకున్నాను. ఎప్పుడూ పందితో కుస్తీ చేయకూడదని. మీరు మురికిగా ఉంటారు. పంది కూడా అలానే మురికిగాఉంటుంది` అని జార్జ్ బెర్నార్డ్ షాని మెన్షన్‌ చేసింది.
undefined
దీంతో సోనమ్‌ ఇంత గరం ఎందుకో అని నెటిజన్లు కామెంట్‌ పెడుతున్నారు. ఇటీవల బాలీవుడ్‌లో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసుకి సంబంధించి వారసత్వంపై అనేక కామెంట్లువస్తున్నాయి.
undefined
ముఖ్యంగా బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా స్టార్‌ వారసులపై, స్టార్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చేస్తూనే ఉన్నారు. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లో పెద్ద దుమారాన్నేరేపుతున్నాయి. ఈ నేపథ్యంలో సోనమ్‌ స్పందించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
undefined
మరి సోనమ్‌ ఫైరింగ్‌కి కారణమదేనా? ఇంకా ఏదైనా ఉందా? అని వెతికే పనిలో ఆమె అభిమానులు, నెటిజన్లు బిజీగా ఉన్నారు. మరికొంది శాంతించూ అంటూ సెటైర్లువేస్తున్నారు.
undefined
2007లో `సావరియా` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సోనమ్‌ కెరీర్‌ ప్రారంభం నుంచి ఆచితూచి సినిమాలు చేస్తుంది. 13ఏళ్ళ కెరీర్‌లో కేవలం 19 సినిమాలే చేసింది.నటనకు, పాత్రకు ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేస్తూ వస్తోంది.
undefined
రెండేళ్ళ క్రితం వ్యాపారవేత్త ఆనంద్‌ ఆహుజాని ప్రేమించి పెళ్ళాడిన సోనమ్‌ కపూర్‌ ఆచితూచి సినిమాలు చేస్తుంది. పెళ్ళి తర్వాత తండ్రి అనిల్‌ కపూర్‌తో కలిసి `ఏక్‌ లడ్కీ కోదేఖా తో హైసా లగా`, `ది జోయా ఫ్యాక్టర్‌` చిత్రాల్లో మెరిసింది. ఈ రెండూ పరాజయం చెందాయి. ఇక కొత్తగా మరే సినిమాని ప్రకటించలేదు. మరి సినిమాలు చేస్తుందా? లేకపర్మినెంట్‌గా బ్రేక్‌ తీసుకుంటుందా? అనేది చూడాలి.
undefined
click me!