సుశాంత్‌ కేసు.. రియా అడ్డంగా దొరికిపోయింది

First Published Sep 3, 2020, 7:34 PM IST

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి ప్రధాన నిందితురాలుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సిబిఐ సైతం ఆమెని ఏ వన్‌గా విచారిస్తుంది. వీరి మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్‌ కూడా రియాపై మరిన్ని అనుమానాలను పెంచుతుంది. తాజాగా మరో సెన్సేషనల్‌ విషయం బయటపడింది.

సుశాంత్‌ కేసులో రియా అడ్డంగా దొరికిపోయే ఫోటో ఒకటి బయటపడింది. నెటిజన్లు, సుశాంత్‌ అభిమానులు వెతికి మరీ రియా చక్రవర్తిని బుక్‌ చేశారు. సుశాంత్‌ ఇంట్లో రియా కేక్‌తో ఉన్న ఫోటోని నెటిజన్లు దొరకబట్టారు. దీన్ని రియా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం.
undefined
సుశాంత్‌తో జరిగిన గొడవ కారణంగా రియా ఆయన ఫ్లాట్‌ నుంచి జూన్‌ 8న వెళ్ళిపోయినట్టు అటు ఈడీకి, పోలీసులకు, ఇటు సిబిఐకి రియా తెలిపింది.
undefined
కానీ జూన్‌ 12న సుశాంత్‌ ఫ్లాట్‌ వద్ద రియా మాంగోతో తయారు చేసిన కేక్‌తో కనిపించిందని అభిమానులు చెబుతున్నారు. రియా ఈ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ లో ఆమె శృతి మోడీని ట్యాగ్‌ చేసింది. ఇందులో `మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని రియా చక్రవర్తికి ట్యాగ్‌ చేశారు.
undefined
దీనిపై సుశాంత్‌ అభిమానులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రియా.. సుశాంత్‌ ఇంటి నుంచి జూన్‌ 8న వెళ్ళి మళ్ళీ..జూన్‌ 12న వచ్చి ఉండాలన్నారు.
undefined
జూన్‌ 8 నుంచి 14 మధ్య ఏం జరిగిందో సీసీటీవీ ఫూటేజీని చెక్‌ చేయాలని అభిమానులు, నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో సుశాంత్‌ కేసు మరో మలుపు తీసుకోబోతుందని చెప్పొచ్చు.
undefined
సుశాంత్‌ జూన్‌ 14న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది హత్య అని బీజేపీ నాయకులతోపాటు పలువురు ఆరోపిస్తున్నారు. డ్రగ్‌ ఇచ్చి ప్లానింగ్‌తో మర్డర్‌ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసుని ప్రస్తుతం సిబిఐ విచారిస్తోంది.
undefined
click me!