ప్రభాస్ ఎవరో బాలీవుడ్ వాళ్లకు తెలియదు... రానా కామెంట్స్ తో మొదలైన రచ్చ!

First Published May 7, 2024, 6:19 PM IST

ప్రభాస్ ఎవరో బాలీవుడ్ కి తెలియదంటూ రానా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఓ పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు. బాహుబలితో దేశాన్ని ఊపేసిన ప్రభాస్ తెలియకపోవడం ఏమిటని ఫ్యాన్స్ తో పాటు జనాలు వాపోతున్నారు. 
 

ప్రభాస్ టాలీవుడ్ లో అతిపెద్ద మార్కెట్ కలిగిన హీరో. ప్రభాస్ తో మూవీ అంటే దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ కావాలి. 2003 వరకు ప్రభాస్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఉండేవాడు. బాహుబలి చిత్రాల అనంతరం ప్రభాస్ క్రేజ్ ఎల్లలు దాటింది. 

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 వందల కోట్ల వసూళ్లు సాధించాయి. బాహుబలి 2 అయితే ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది. ఆ రికార్డు ఇంతవరకు బ్రేక్ కాలేదు. బాహుబలి అనంతరం ప్రభాస్ చేసిన చిత్రాలు ప్లాప్ టాక్ తో కూడా వందల కోట్లు వసూలు చేశాయి. 

మరి అలాంటి స్టార్ ప్రభాస్ ని బాలీవుడ్ వాళ్ళు గుర్తించలేదట. బాహుబలి సిరీస్లో ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న రానా ఈ మాట స్వయంగా అన్నారు. ఓ ప్యాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రానా ఈ మేరకు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 

రానా రెండో చిత్రమే బాలీవుడ్ లో చేశారు. దమ్ మారో దమ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ మరొక హీరో. అలాగే డిపార్ట్మెంట్, బేబీ, ఏ జవానీ హై దివానీ, బేబీ వంటి హిందీ చిత్రాలు చేశాడు రానా. దాంతో తరచుగా ముంబైకి వెళుతూ ఉండేవారు. 

Bahubali 2

దీంతో బాలీవుడ్ ప్రముఖులతో బాహుబలి సినిమా గురించి చెప్పారట. ఎవరు నటిస్తున్నారు బాహుబలి మూవీలో అని వాళ్ళు అడిగారట. ప్రభాస్ అని చెప్పగా... ఎవరు ప్రభాస్ అన్నారట. మీరు మిర్చి, ఛత్రపతి చిత్రాలు చూడలేదా? ఆ చిత్రాల హీరో అన్నాడట రానా. ఫోటో చూపించినా కూడా వాళ్ళు ప్రభాస్ ని గుర్తు పట్టలేదట.. 

బాహుబలికి ముందు ప్రభాస్ ఇమేజ్ టాలీవుడ్ కి మాత్రమే పరిమితం. ఇదే విషయం రానా వెల్లడించాడు. ప్రస్తుతం ప్రభాస్ కి విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్ లో ప్రభాస్ అంటే పడి చస్తారు. ఆయన్ని చూసేందుకు ఈ దేశం వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

click me!