దిశా పటానీ (Disha Patani) ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. కానీ ఈ బ్యూటీ సినీ కేరీర్ ను మాత్రం టాలీవుడ్ తోనే ప్రారంభించింది. మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దిశా పటానీని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నటిగా మార్చారు.
టాలీవుడ్ లోకి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘లోఫర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది దిశా. ఈ మూవీతో సౌత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఫస్ట్ మూవీ అయినా..బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వడంతో దిశాకు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత బాలీవుడ్ కు షిఫ్ట్ అయిన దిశా స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటిస్తోంది.
దిశా పటానీ బాలీవుడ్ లో ఇఫ్పటి వరకు ‘ఎంఎస్ ధోనీ, కుంగు ఫూ యోగా, వెల్ కమ్ టు న్యూయార్క్, భాగీ2,3, భగత్, మలంగ్, రాధే’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఏక్ విలన్ రిటన్స్, యోదా, కేటినా వంటి హిందీ చిత్రాల్లో నటిస్తోంది. వరుస చిత్రాల్లో అవకాశం దక్కించుకుంటూ దూసుకెళ్లోంది.
అలాగే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కే’లోనూ సెకండ్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు నాగ్ అశ్విన్. అయితే ఇలాంటి పెద్ద సినిమాల్లో నటిస్తూ కూడా దిశా పటానీ తను హీరోయిన్ కాకూదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇంతకీ దిశా ఏం చెప్పాలనుకుందంటే.. తను హీరోయిన్ అవుతానని అనుకోలేదంట. ఫైలెట్ కావడం తన అసలు గోల్ అని చెప్పింది. తన లక్ష్యాన్ని రీచ్ అయ్యేందుకు కావాల్సిన డబ్బులను సమకూర్చుకునేందుకు మోడలింగ్ గా ప్రయత్నించానని తెలిపింది. అలాగే పలు కమర్షియల్స్ యాడ్స్ లోనూ నటించానంది.
అప్పటికే మంచి గుర్తింపు రావడం.. అదే సమయంలో లోఫర్ సినిమా ప్రారంభం కావడంతో నటిగా అవకాశం వచ్చిందంది. ఆ తర్వాత కూడా ఫైలెట్ అయ్యేందుకు ప్రయత్నించినా.. వరుసగా సినిమాల ఆఫర్లు రావడంతో హీరోయిన్ గా మారాల్సి వచ్చిందని చెప్పింది. ‘ఎంఎప్ ధోనీ’ సినిమా సక్సెస్ తో ప్రత్యేక గుర్తింపు దక్కిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కేరీర్ కు ఎలాంటి ఢోకా లేదంటోంది.