ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. సప్తగిరి, షకలక శంకర్, వెన్నెల కిషోర్ కమెడియన్లుగా మెరిశారు. మాస్ మహారాజ్ రవితేజ ఈ చిత్రంలో 40 నిమిషాల గెస్ట్ రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. చిరు, రవితేజ చాలా ఏళ్ల తర్వాత ఒకే ప్రేములో వెండి తెరపై కనిపించబోతుండడంతో ఆసక్తి నెలకొంది. అయితే ఈ చిత్రంలో తమిళ విలక్షణ నటుడు బాబీ సింహా కూడా కీలక పాత్రలో నటించారు.