భారీ మొత్తంలో నష్టాలను మిగిల్చిన రెండో చిత్రం అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ‘ఏజెంట్’గా తెలుస్తోంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈచిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అఖిల్ ఈ చిత్రం కోసం బాగా కష్టపడ్డారు. కానీ ఫలితం బెడిసికొట్టింది. రూ.60 కోట్లకు పైగా నిర్మాత రాంబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర నిర్మించారు. చివరి ఈ చిత్రం రూ.33 కోట్లకు పైగా నష్టాన్ని మిగిల్చిందని తెలుస్తోంది. మరోవైపు మేకర్స్, అఖిల్ కూడా ఈ మూవీ ఫెయిల్ అవ్వడాన్ని ఒప్పుకోవడం గమనార్హం.