బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రెండు వారాల క్రితం(సెప్టెంబర్ 1)ని గ్రాండ్గా ప్రారంభమైన విషయం తెలిసిందే. 14 మందితో ఈ షోని ప్రారంభించారు నాగార్జున. ప్రస్తుతం 12 మంది హౌజ్లో ఉన్నారు. మొదటి వారంలో బేబక్క ఎలిమినేట్ కాగా, రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు.
అయితే మధ్యలో `బిగ్ బాస్ తెలుగు 8 2.0 ఉంటుందని, మరో మిని ఓపెనింగ్ ఉంటుందని తెలుస్తుంది. ఐదు మంది మాజీ కంటెస్టెంట్లని వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకురాబోతున్నారట. వారిలో శోభా శెట్టి, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, హరితేజ ఉన్నట్టు టాక్.