ఇది అలాంటి ఎలిమినేషన్, నోరు విప్పిన శేఖర్ బాషా!

First Published Sep 16, 2024, 7:04 PM IST


శేఖర్ బాషా ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అనే వాదన గట్టిగా వినిపిస్తున్న క్రమంలో, ఆయన రియాక్ట్ అయ్యాడు. మీడియా వేదికగా సంచలన కామెంట్స్ చేశాడు. 
 

Shekar Basha


ఎవరు ఊహించని విధంగా శేఖర్ బాషా రెండో వారం ఎలిమినేట్ అయ్యాడు. 2వ వారానికి గాను విష్ణుప్రియ, శేఖర్ బాషా, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, సీత, నైనిక, నిఖిల్, పృథ్విరాజ్ నామినేట్ అయ్యారు. వీరిలో ఒక్కొక్కరు సేఫ్ అవుతూ వచ్చారు.  చివరిగా శేఖర్ బాషా, ఆదిత్య ఓం మిగిలారు. 

Shekar Basha Bigg Boss 8


వీరిద్దరిలో ఎవరు బయటకు వెళ్లాలో  హౌస్ మేట్స్ నిర్ణయించాలని నాగార్జున ఆదేశించారు. మెజారిటీ కంటెస్టెంట్స్ శేఖర్ బాషా వెళ్లిపోవాలని, ఆదిత్య ఓం ఇంట్లో ఉండాలని చెప్పారు. దాంతో శేఖర్ బాషా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున వెల్లడించారు. అతన్ని వేదిక మీదకు రావాలని కోరాడు. 

శేఖర్ బాషా భార్య అబ్బాయికి జన్మనిచ్చినట్లు నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే. శేఖర్ బాషా బయటకు వెళ్లాలని కంటెస్టెంట్స్ నిర్ణయించడం వెనుక కారణం కూడా ఇదే. అయితే శేఖర్ బాషా స్ట్రాంగ్ కంటెస్టెంట్. గత రెండు వారాల్లో ఆయన గేమ్ చూసినవారెవరు ఎలిమినేట్ అవుతాడని ఊహించి ఉండరు. శేఖర్ బాషా ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. హౌస్ నుండి బయటకు వచ్చిన శేఖర్ బాషా మొదటిసారి తన ఎలిమినేషన్ పై స్పందించారు. మీడియా ముఖంగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 

Latest Videos


శేఖర్ బాషా మాట్లాడుతూ.. ఇది ప్రేమతో కూడిన ఎలిమినేషన్. ఎవరినీ తప్పు పట్టకండి. బిగ్ బాస్ చరిత్రలో మొదటిసారి నేను కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేయడం ద్వారా బయటకు వచ్చారు. సాధారణంగా ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఎలిమినేట్ చేస్తారు. నన్ను అందుకు భిన్నంగా ఎలిమినేట్ చేశారు, అన్నారు.
 
టాప్ 5 లో ఎవరు ఉంటారని మీడియా ప్రతినిధులు అడగ్గా.. అది నేను చెప్పలేను. సీత టైటిల్ గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆమె తెలుగు అమ్మాయి. అలాగే విష్ణుప్రియ గెలిచినా మంచిదే, అన్నారు. శేఖర్ బాషా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. శేఖర్ బాషా ఎలిమినేషన్ తో బిగ్ బాస్ హౌస్లో 12 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. 

Bigg boss telugu 8

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలై  రెండు వారాలు అవుతుంది. షో అంత రసవత్తరంగా లేదు. కంటెస్టెంట్స్ అందరూ చప్పగా ఉన్నారు. వీరిలో గేమ్ లేదు, ఫైర్ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫస్ట్ వీక్ టీఆర్పీ ఆశించిన స్థాయిలో లేదట. సెకండ్ వీక్ లో టీఆర్పీ మరింత తగ్గే సూచనలు కలవు.  
షోని రంజుగా మార్చాలంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు స్ట్రాంగ్ గా ఉండాలని భావిస్తున్నారట మేకర్స్. ఈ క్రమంలో కొత్త వాళ్ళను కాకుండా మాజీ కంటెస్టెంట్స్ ని రంగంలోకి దింపుతున్నారట. ఈ లిస్ట్ లో హరి తేజ, రోహిణి, శోభా శెట్టి, అవినాష్, టేస్టీ తేజ ఉన్నారట.   

  హరి తేజ మొదట్లో పలు సీరియల్స్ లో నటించింది. అనంతరం సిల్వర్ స్క్రీన్ పై అవకాశాలు రాబట్టింది. ముప్పైకి పైగా సినిమాల్లో హరి తేజ నటించింది.   జబర్దస్త్ లేడీ కమెడియన్ గా ఫేమ్ రాబట్టింది రోహిణి. గతంలో రోహిణి సీరియల్స్ లో కూడా నటించింది. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు వెండితెరపై సత్తా చాటుతుంది. రోహిణికి కమెడియన్ గా వరుస అవకాశాలు వస్తున్నాయి. రోహిణి బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్ట్ చేసింది. 
 

Bigg Boss Telugu 8


  సీజన్ 4 కంటెస్టెంట్స్ లో ముక్కు అవినాష్ ఒకడు. అవినాష్ ఆ సీజన్ కి గాను వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. అవినాష్ గొప్ప ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నాడు.  అత్యంత నెగిటివిటీ తో బయటకు వచ్చిన మాజీ కంటెస్టెంట్ శోభా శెట్టి. సీజన్ 7లో కంటెస్ట్ చేసిన శోభా శెట్టి ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచింది.సీజన్ 7 లో పార్టిసిపేట్ చేసిన మరొక కంటెస్టెంట్ టేస్టీ తేజ. ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టిన టేస్టీ తేజా ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నాడు.

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

click me!