బిగ్ బాస్ 5 లీక్: అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఐదుగురు కంటెస్టెంట్స్ వీరే

First Published Sep 4, 2021, 12:11 PM IST


వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఇంకా కేవలం గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా... షో గురించి ఇంట్రెస్టింగ్ డిటైల్స్ బయటికి వస్తున్నాయి. 

బిగ్ బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ క్వారంటైన్ ముగిసినట్లు తెలుస్తుండగా, ఎంపికైన కంటెస్టెంట్స్ వద్ద నుండి మొబైల్స్ కూడా నిర్వాహకులు స్వాధీనం చేసుకున్నారట. 

అందరికీ కరోనా పరీక్షలతో, పాటు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మొదటి ఎపిసోడ్ షూటింగ్ కి సిద్ధం చేశారట. బిగ్ బాస్ యూనిట్ ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్లను ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఈ జాబితాలో యాంకర్ జస్వంత్, నటి ప్రియ, నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్, శ్వేతా వర్మ, నటి ఉమాదేవి, మానస్,యూట్యూబర్ షణ్ముఖ్, వి.జె.సన్నీ,జబర్దస్త్ ప్రియాంక సింగ్, లోబో, శ్రీరామ్, ఆర్జే కాజల్, జశ్వంత్, లహరి, సిరి హనుమంత్, సరయు, విష్ణు ఉన్నారని వినికిడి. 

ఈ పదహారు మంది కంటెస్టెంట్స్ లో  ఐదుగురు అత్యధిక పారితోషికంగా తీసుకుంటున్నారట. మిగతా కంటెస్టెంట్స్ తో పోల్చితే యాంకర్ రవి, నటి ఉమాదేవి, యూట్యూబర్ షణ్ముఖ్, నటి ప్రియ, కొరియోగ్రాఫర్ యాని మాస్టర్ అత్యధికంగా తీసుకుంటున్నారట. 

అయితే వారికి షో నిర్వాహకులు ఎంత ఇస్తున్నారనే విషయంపై స్పష్టత లేదు. అలాగే రెమ్యూనరేషన్ ఒక్కొక్కరికి ఒకలా వారి ఫేమ్, నేమ్ తో పాటు బార్గైనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఒకరి రెమ్యూనరేషన్ గురించి మరొకరికి తెలిసే అవకాశం ఉండదు. 
 

ఇక ఎన్ని ఉహాగానాలు చక్కర్లు కొట్టినా మొదటి ఎపిసోడ్ ముగిసే వరకు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్ గురించి ఖచ్చితంగా చెప్పలేము. ఆదివారం సాయంత్రం 6గంటలకు ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 5 కర్టైన్ రైసింగ్ ఎపిసోడ్ తో అన్ని అనుమానాలు పటాపంచలు కానున్నాయి. 
 

click me!