ఇక పల్లవి ప్రశాంత్ `రైతు బిడ్డ` ట్యాగ్ వాడుకోవడంపై వచ్చే విమర్శలపై స్పందిస్తూ, రైతు బిడ్డ.. రైతు బిడ్డ అని చెప్పుకోవడంలో తప్పేముంది, మిగిలిన వాళ్లంతా తమ ప్రొఫేషన్స్ ని చెబుతున్నారు, అలా తన వృత్తిని చెప్పుకున్నాడు, అందులో తప్పేం ఉంది. ఎందుకు దాన్ని వివాదం చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారని అన్నారు. కొందరు పడని వాళ్లు, అసూయతో తట్టుకోలేని వాళ్లు మాట్లాడే మాటలు ఇవి అన్నారు. తను నిజాయితీగా ఆట ఆడాడని, అదే అతన్ని విన్నర్ని చేసిందని, తాను గెలిపించాననేదాంట్లో నిజం లేదన్నారు. ప్రశాంత్లో మున్ముందు మంచి స్థానానికి వెళ్తాడని లైఫ్లో చాలా సాధిస్తాడని తెలిపారు శివాజీ.