నాపై కుళ్లు జోకులేసుకున్నారు, ఆ కమెడియన్ నా గురించి వల్గర్ గా మాట్లాడాడు.. హనీరోజ్ షాకింగ్ కామెంట్స్..

First Published Jun 3, 2023, 3:02 PM IST

తన గురించి షాకింగ్ కామెంట్స్ విన్నానంటోంది బాలయ్య భామ హనీరోజ్. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బ్యూటీ.. తనకుజరిగిన అవమానం గురించి వెల్లడించింది. 

కేరళ అందాల భామ హనీరోజ్.. ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. మళ్ళీ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తుందా అని అంతా ఎదురుచూసేలా ప్రభావం  చూపించింది హనీరోజ్. బాలకృష్ణ  హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య కు జోడీగా నటించింది  హనీ రోజ్. ఈసినిమాతో ఆమెకి తెలుగులో మంచి ఆదరణ లభించింది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో హనీ రోజ్ మాట్లాడుతూ..  షాకింగ్ కామెంట్స్ చేసింది.  ఇండస్ట్రీలో చాలా మంది నాపై కుళ్లు జోకులు వేసుకొని నవ్వుకునేవారు.. నా ముందు చాలా అందంగా ఉన్నావంటూనే పక్కకు వెళ్లి నాపై బాడీషేమింగ్  కామెంట్స్ చేసేవారు. కొన్ని ట్రోల్స్ నవ్వులు తెప్పిస్తుంటాయి.. మరికొన్ని మనసు ఎంతగానో నొప్పిస్తుంటాయి అన్నారు హనీరోజ్. 

ముఖ్యంగా తన  శరీరాకృతి గురించి కొంతమంది పిచ్చి కామెంట్స్ చేస్తుంటే హనీరోజ్ చాలా బాధపడేదట. ఏడుపొచ్చినా. దిగమింగుకుని భరించిందట హనీ. అంతే కాదు  ఇప్పటికీ అవి గుర్తుకు వచ్చినప్పుడు  వాటన్నింటిని మర్చిపోవడానికి గట్టిగా  ప్రయత్నిస్తున్నాను అని అన్నారు హనీ రోజ్. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఒక్కోసారి అదే కొనసాగుతుందంటూ.. ఓ చిన్న ఉదాహరణ కూడా చెప్పింది హనీ. 
 

హనీరోజ్ మాట్లాడుతూ.. రీసెంట్ గా ఓ  టీవీ షో కి వెళ్లాను.. అక్కడ నన్ను.. నా శరీరాన్ని  షేమింగ్ చేస్తూ వెటకారంగా మాట్లాడారు. అది విని ఆ షో యాంకర్ కూడా పెద్ద పెద్దగా నవ్వేసింది. కాని ఓమహాళ అయ్యుండి.. సాటి మహిళను అయిన నాపై చేస్తున్న కామెంట్స్ విని వ్యతిరేకించలేదు. అది మానేసి  మానేసి అలా పగలబడి నవ్వడం నాకు అస్సలు నచ్చలేదు అన్నారు హనీరోజ్. అంతే కాదు ఈ విషయంలో  చాలా బాధేసిందంటూ.. ఆవేదన వెల్లడించారు కూడా. 
 

ఇక అంతే కాదు  ఓ కమెడియన్ నా శరీర భాగాల గురించి ఏదేదో పిచ్చిగా మాట్లాడాడు.. ఇలా బాడీ షేమింగ్ చేస్తు మహిళలను హేళన చేస్తుంటే.. వాటిని టీవీల్లో చూపించడం ద్వారా ఏ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఏమో తెలియడం లేదు... అసలు వాళ్లైనా వీటిని ఎలా ప్రసారం ఎలా చేస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది నటి హనీ రోజ్. 

ఎప్పుడో 15  ఏళ్ళ క్రితమే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది హనీరోజ్. 2005 లో మాలీవుడ్ లో రిలీజ్ అయిన బాయ్ ఫ్రెండ్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. హనీ రోజ్ తెలుగులో కూడా సినిమాలు చేసింది.  ఆలయం, ఈ వర్షం సాక్షిగా మూవీస్ లో నటించింది.. కాని ఈ సినిమాలు ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయి. దాంతో టాలీవుడ్ లో మరేసినిమా చేయలేదు బ్యూటీ.. ఇక ఇన్నేళ్ళ తరువాత మళ్లీ..  బాలయ్యతో నటించిన వీర సింహారెడ్డి మూవీతో మంచి గుర్తింపు లభించింది.

click me!