ఎన్టీఆర్ ఒకవైపు నారా, నందమూరి ఫ్యామిలీ మరోవైపు. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణకు టీడీపీలో ప్రాతినిధ్యం తగ్గించినప్పటి నుండే ఈ లొల్లి ఉంది. అప్పుడప్పుడూ కలిసినట్లు కనిపించినా చాప కింద నీరులా విబేధాలు విస్తరిస్తున్నాయి. 2009లో టీడీపీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ తర్వాత జరిగిన పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2019లో టీడీపీ ఓటమి తర్వాత ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. టీడీపీ శ్రేణుల్లో బలపడుతున్న ఈ ఆలోచన అణచివేయాలంటే ఎన్టీఆర్ పై వ్యతిరేకత తేవాలి. అందుకు చంద్రబాబు సమయం దొరికినప్పుడల్లా ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తున్నాడనే వాదన ఉంది.