చైతన్య మంచి వ్యక్తి. ఎప్పుడూ పక్కవాళ్ళ గురించి ఆలోచిస్తారు. సహాయం చేస్తారు. మేము ఒంగోలులో ఈవెంట్ చేస్తుండగా చైతన్య మరణవార్త తెలిసింది. ఆయన కొందరు ఆర్టిస్ట్స్ కి డబ్బులు ఇవ్వాల్సి ఉంది. వాళ్ళు ఫోన్స్ చేస్తున్నారు. ఆయనకు ఇబ్బందిగా ఉంటే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే సరిపోయేది. డబ్బులు ఇవ్వలేనంటే ఒప్పుకునేవారు. ప్రాణాలు తీసుకుని తప్పు చేశారు. ఆయన నిర్ణయం వలన అమ్మ, నాన్న, చెల్లి బాధపడుతున్నారు, అని ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేసింది.