అర్జున-ఫల్గుణ కథ విషయానికి వస్తే.. ఒక ఊరిలో బాగా క్లోజ్ గా ఉండే ఐదుగురి ఫ్రెండ్స్ అర్జున్, రాంబాబు, తడ్డోడు, ఆస్కార్, శ్రావణి. వీరు చేసే కొంటె పనులకు అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. సినిమా కథ మొత్తం ఈ ఐదుగురి చుట్టూ తిరుగుతుంది. అయితే వారి పేర్లను గమ్మత్తుగా ఆది, రాఖీ, సింహాద్రి, యమదొంగ అని చెప్పుకుంటారు. సరదాగా సాగిపోతున్న వీరిజీవితాన్ని గంజాయి కేసు మలుపు తిప్పుతుంది. వీరు పోలీసులకు చిక్కినప్పటినుంచి కథ మలుపు తిరిగి ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది.మరి వీరు ఆ కేసులో ఎలా ఇరుక్కున్నారు..? ఆ కేసు నుంచి బయటకు వచ్చారా లేదా...? క్లైమాక్స్ ట్వీస్ట్ ఏంటీ అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.